Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అర్ధరాత్రి వరకూ పనిచేసిన లోక్ సభ...! ముచ్చటపడిన సాయిరెడ్డి..!

గత కొన్నేళ్లుగా పార్లమెంట్ సమావేశాలు అంటే మనకు సాధారణంగా కనిపించేవి విపక్షాల నిరసనలు, కేంద్రం ఎదురుదాడి, వాయిదాల పర్వాలే. కానీ నిన్న మాత్రం అర్ధరాత్రి దాటినా లోక్ సభ పనిచేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ పై సుదీర్ఘ చర్చకు కేంద్రం అంగీకరించింది. దీంతో విపక్షాలు కూడా అంతే దీటుగా చర్చ సాగించాయి. కేంద్రం వర్సెస్ విపక్షంగా సాగిన ఈ చర్చ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా కొనసాగింది.

దీనిపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. వారం రోజుల అంతరాయం తర్వాత నిన్న రాత్రి లోక్‌సభ సజావుగా పనిచేయడం చూసి సంతోషం కలిగిందంటూ సాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. హోంమంత్రి అమిత్‌షానేతృత్వంలోని పలువురు క్యాబినెట్ మంత్రులు చురుకుగా పాల్గొనడంతో, ఉదయం 12:52 గంటలకు లోక్ సభ వాయిదా పడిందన్నారు. తీవ్రమైన, ఆకర్షణీయమైన చర్చను మొత్తం దేశం నిశితంగా గమనిస్తోందంటూ సాయిరెడ్డి పేర్కొన్నారు.

former ysrcp mp relishes on lok sabha worked till midnight over operation sindoor debate

నిన్న అర్ధరాత్రి వరకూ లోక్ సభ వేదికగా సాగిన ఆపరేషన్ సిందూర్ చర్చను దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా టీవీల్లో చూసారు. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ విషయంలో కేంద్రం విఫలమైందంటూ విపక్షాలు విమర్శలకు దిగుతున్న వేళ అధికార పక్షం ఏం సమాధానం చెబుతుందన్న ఆసక్తి వారిలో కనిపించింది.

అదే సమయంలో విపక్ష ఎంపీలు ఇన్నాళ్లూ పార్లమెంట్ వెలుపల చేసిన విమర్శల్ని లోక్ సభలోనూ కొనసాగించాయి. దీనికి ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీ సమాధానం చెప్పే అవకాశముంది. ఈ నేపథ్యంలో లోక్ సభలో చర్చను ప్రశంసిస్తూ సాయిరెడ్డి ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+