వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోనేరులో పడి నలుగురు విద్యార్థులు మృతి: ప్రేమ జంటలుగా అనుమానం

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: జిల్లాలోని శంకరపట్నం మండలం కొత్తగట్టులో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. మత్స్యగిరీంద్రస్వామి ఆలయ కోనేరులో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. కాగా, నలుగురి మృతదేహాలను స్థానికులు వెలికితీశారు.

ఇది ఇలా ఉండగా మృతిచెందిన వారు ప్రేమ జంటలని పోలీసులు అనుమానిస్తున్నారు. మరణించిన వారిలో కిరణ్‌(22), శ్రీధర్‌, స్వప్న(21), వాహిని(22)గా పోలీసులు గుర్తించారు. మృతులు కోతిరాంపూర్‌, రాంనగర్‌ కాలనీకి చెందిన వారని తెలిపారు.

four students fell in lake and died

వీరంతా ప్రగతి కంప్యూటర్‌ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థులని పోలీసులు వెల్లడించారు. బుధవారం స్వప్న పుట్టిన రోజు కావడంతో ఆలయానికి వచ్చిన వారు.. కోనేరులో ఈత కొట్టేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందినట్లు తెలుస్తోంది.

బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

బీటెక్ విద్యార్థిని వాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని హన్మకొండలోని ఎస్‌ఆర్ కళాశాలలో చోటు చేసుకుంది. విద్యార్థిని మృతిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు.

English summary
Four students allegedly fell in a lake and died in Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X