ఏపీలో నిత్యకృత్యంగా గంజాయి దందా .. పాలకొల్లులో భారీగా గంజాయి పట్టివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. ఒక పక్క కరోనా మహమ్మారి రోజు రోజుకూ చాప కింద నీరులా విస్తరిస్తున్నా , రాష్ట్రం యుద్ధం చేస్తున్నా అవేవీ పట్టనట్టు గంజాయి అక్రమ రవాణా యదేచ్చగా జరుగుతుంది . గంజాయి స్మగ్లర్లు ఈ సమయంలో కూడా అక్రమ మార్గాల ద్వారా గంజాయి దందా సాగిస్తున్నారు.
గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలను ఎంచుకుంటూ ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్నారు. పోలీసులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిని పట్టుకోవటం నిత్య కృత్యంగా మారింది . తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. కారులో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. రూ.21 లక్షల 75వేల విలువైన 435 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు ఒక కారు, రెండు బైక్లు, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరి నుండి వివరాలు రాబడుతున్నారు. వారు ఎక్కడ నుడి గంజాయి తీసుకు వెళ్తున్నారు అలాగే ఎక్కడికి ఈ గంజాయిని తరలిస్తున్నారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠాలో ఎంత మంది ఉన్నారు అని దర్యాప్తు చేస్తున్న పోలీసులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications