విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లా కాలేజీని దత్తతు తీసుకున్న మంత్రి గంటా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం లా కాలేజీని దత్తతు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆదివారం విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపర్‌లో మాట్లాడుతూ లా కాలేజీని మోడల్ క్యాంపస్‌గా తీర్చిదిద్దుతానని అన్నారు.

ప్రతి ఏటా పూర్వ విద్యార్ధుల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. హుధూద్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రూ. 3 కోట్ల విరాళాలు అందాయని పేర్కొన్నారు. హుధుద్ తుఫాన్‌ను జయించిన సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 12న రాష్ట్ర ప్రభుత్వం సంబురాలు నిర్వహించనుందని తెలిపారు.

Ganta Srinivasa Rao adopted andhra university law college in Visakhapatnam

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 90 శాతం విద్యుత్ పునరుద్దరించినట్లు తెలిపారు. విద్యార్ధులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించామన్నారు.

రేపటి నుంచి తరగతి గదులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. తుఫాన్ భీభత్సానికి అల్లకల్లోలం అయిన యూనివర్సిటీ కోసం పూర్వ విద్యార్ధులు దారాళంగా విరాళాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

English summary
Andhra Pradesh Minister Ganta Srinivasa Rao adopted andhra university law college in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X