Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రేమికుల బైక్ రేసింగ్‌, యువతి మృతి: మసాజ్ సెంటర్లపై దాడి

హైదరాబాద్: మూడు ప్రేమ జంటలు నగరంలోని సంఘీ టెంపుల్ వెళుతూ సరదాగా బైక్ రేసిందగ్ చేశారు. అయితే వారి సరదా కాస్తా విషాదంగా ముగిసింది. అదుపుతప్పిన ఓ ప్రేమ జంట బైక్ పల్టీలు కొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.

శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె ప్రియుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన హయత్‌నగర్ మండలం సంఘీనగర్‌లో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

 A girl died in road accident

మసాజ్ సెంటర్లపై పోలీసులు దాడులు

గచ్చిబౌలిలోని మసాజ్ సెంటర్లు, స్పాలపై వెస్ట్‌జోన్ పోలీసులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఉప్పల్‌లోని ఐడీఏలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 42 వేల నగదును, 8 సెల్‌ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

విద్యుత్ షాక్‌తో వ్యక్తి సజీవ దహనం

సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రి సమీపంలోని ఓ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద వ్యక్తి మూత్రం పోస్తుండగా ఒక్కసారిగా అతనికి విద్యుత్ తగలింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ హై ఓల్టేజితో రావడంతో అతడు మంటల్లో పూర్తిగా కాలిపోయాడు.

అతనికి సంబంధించిన ఎలాంటి వివరాలు కూడా లభించకుండాపోయాయి. గతంలోనూ ఈ ప్రాతంలో ఇదే తరహాలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మంటలు ఎగసిపడటానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ లేక మరేదైనా కారణమా అని తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+