శ్రీకాకుళం వాసులకు రైల్వే బిగ్ న్యూస్- కొత్తగా ఈ రైళ్లకు హాల్ట్ లు..!
ఏపీలో వెనుక బడిన శ్రీకాకుళం జిల్లాకు కేంద్రం నుంచి ఇవాళ మరో గుడ్ న్యూస్ అందింది. ఈ జిల్లాకు చెందిన కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లాబీయింగ్ తో ఇప్పటికే పలు ప్రయోజనాలు అందుకుంటున్న ఈ జిల్లాకు ఇప్పుడు రైల్వేశాఖ మరో తీపికబురు చెప్పింది. శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు హాల్ట్ లు ఇవ్వాలంటూ ఇక్కడి ప్రజలు కోరుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ అందుకు అంగీకరించిందని రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
శ్రీకాకుళం జిల్లా వాసుల దీర్ఘకాలిక రైల్వే డిమాండ్లకు నేడు అనుమతి లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ రామ్మోహన్ నాయుడు ఇవాళ ట్వీట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యం, అనుసంధానం, రోజువారీ ప్రయాణ సౌలభ్యం ఉపయోగపడేలాగా నేడు రైల్వే శాఖ జిల్లాలోని కీలక రైల్వే స్టేషన్ లలో హల్ట్ లు మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు.

ఇందులో మంజూరైన రైళ్ల హాల్ట్ వివరాలు:
• పూరి-అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ - ఇచ్చాపురం వద్ద
• బెరంపూర్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ - తిలారు వద్ద
• భువనేశ్వర్-న్యూ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ - బారువ వద్ద
శ్రీకాకుళం జిల్లా వాసుల దీర్ఘకాలిక రైల్వే డిమాండ్లకు నేడు అనుమతి లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యం, అనుసంధానం, రోజువారీ ప్రయాణ సౌలభ్యం ఉపయోగపడేలాగా నేడు రైల్వే శాఖ జిల్లాలోని కీలక రైల్వే స్టేషన్ లలో హల్ట్ లు మంజూరు… pic.twitter.com/19NJovMtvz
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) January 2, 2026
ఈ అన్ని రైలు హాల్ట్ లు త్వరలోనే అమలులోకి రానున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ ట్వీట్ లో తెలిపారు. ప్రజా ప్రయోజనాన్ని ప్రధానంగా తీసుకుని, ఈ అంశంపై నేను ఎంతోకాలంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సానుకూల స్పందన ఇచ్చి సహకరించిన గౌరవనీయులైన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు, అలాగే రైల్వే అధికారులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం శ్రీకాకుళం జిల్లాకు మెరుగైన రైలు సౌకర్యాలు, అభివృద్ధి దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన అభివర్ణించారు.












Click it and Unblock the Notifications