టిడిపి ఖాళీ: హరీష్ రావు, విభజన జరిగింది: జెడి శీలం

తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు తన సామాజిక వర్గీయుడైన బిజెపి నేత వెంకయ్యనాయుడుతో కలిసి చేయని ప్రయత్నం లేదని విమర్శించారు. రెండు కళ్ల సిద్ధాంతం, సమన్యాయం అని చెప్పుకునే చంద్రబాబు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడానికి తన సర్వశక్తులను ఒడ్డాడని ఆయన ధ్వజమెత్తారు. తెరాస కాంగ్రెస్లో విలీనం కావడానికి యావత్ తెలంగాణ ప్రజానీకం నిరాకరిస్తోందన్నారు.
విభజన జరిగింది: శీలం
తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిందని, రెండు రాష్ట్రాలకు పంపకాలే మిగిలాయని కేంద్రమంత్రి జెడి శీలం అన్నారు. గుంటూరు జిల్లాలో ఆయన 6 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే గాదె వెంకట రెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశంలో సీమాంధ్రను ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు.
ప్రత్యేక హోదా కల్పించటం వల్ల రాష్ట్రానికి ప్రతి ఏడాది 12 వేల కోట్లరూపాయలు వస్తాయన్నారు. పన్ను రాయితీల వల్ల పరిశ్రమలు అత్యధికంగా వస్తాయని తెలిపారు. మాయమాటలు చెప్పి, నాటకాలు వేసే వారు వస్తుంటారని అలాంటి వారి మాటలు ప్రజలు నమ్మరాదని కోరారు. శాంతి, సమాధానం కోరుకునే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలన్నారు. విషబీజాలు నాటే బిజెపితో పొత్తు కుదుర్చుకునే వారిని నమ్మరాదన్నారు.
టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలపై కన్నా
విభజనలో సీమాంధ్రను నిరభ్యంతరంగా తాకట్టు పెట్టి నేడు ఆ నెపాన్ని కాంగ్రెస్పై మోపేందుకు ప్రయత్నిస్తున్న టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు వెన్నుపూస లేనట్లేనని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ రెండు పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు చంద్రబాబు, జగన్, కిరణ్ కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీలో కొనసాగి కొమ్ములు తెచ్చుకొని వాటితో కుమ్మడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
వారిపై కేసులు పెట్టాలి
కిరణ్, లగడపాటి రాజగోపాల్పై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలని పార్లమెంట్ సభ్యుడు వివేక్ డిమాండ్ చేశారు. వీరిద్దరు ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించారన్నారు. కెసిఆర్ కలలు గన్న తెలంగాణను నిర్మించుకుంటామన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications