Jaahnavi kandula: 262కోట్ల పరిహారం వేళ బిగ్ షాక్-మరో పెను విషాదం..!
అమెరికాలోని సియాటిల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (jaahnavi kandula) కుటుంబంలో తాజాగా మరో పెను విషాదం చోటు చేసుకుంది. సియాటిల్ పోలీసు అధికారి పెట్రోలింగ్ వాహనం ఢీకొన్ని జాహ్నవి మృత్యువాత పడ్డ రెండేళ్ల తర్వాత ఆమె కుటుంబం ఈ కేసులో న్యాయపరమైన విజయం సాధించింది. ఈ విషయంపై ప్రకటన వచ్చేలోపే ఆదోనిలో ఉంటున్న ఆమె తండ్రి అనూహ్య రీతిలో తుదిశ్వాస విడిచారు.
సియాటెల్ లో పోలీసు అధికారి నడిపిన పెట్రోలింగ్ వాహనం ఢీకొని కందుల జాహ్నవి చనిపోయిన తర్వాత రెండేళ్లుగా ఆమె కుటుంబం పరిహారం కోసం అమెరికాలో న్యాయపోరాటం చేస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ఆమె కుటుంబానికి అండగా నిలిచింది. దీంతో తాజాగా జాహ్నవి కుటుంబంతో 262 కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకునేందుకు సియాటిల్ ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై అక్కడి అటార్నీ నుంచి నిన్న ప్రకటన వెలువడటంతో భారత్ లో అంతా సంతోషించారు.

కానీ విచిత్రంగా ఈ ప్రకటన రావడానికి 48 గంటల ముందే జాహ్నవి తండ్రి శ్రీకాంత్ చనిపోయారు. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జాహ్నవి తండ్రి శ్రీకాంత్.. ఆమె మరణం తర్వాత దీన్ని భరించలేక దీర్ఘకాల సెలవులో ఉన్నారు. ఆయన తన కుమార్తె గురించి వార్తలను తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. తాజాగా శ్రీకాంత్ కు అనంతపురం జిల్లా గుంతకల్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ జాయిన్ అయ్యేందుకు వెళుతుండగా ఆటోలో ఆయన గుండెపోటుతో చనిపోయారు. కూతురు చనిపోయిందని అమెరికాలో పోరాడి 262 కోట్లు పరిహారంగా లభిస్తున్న సమయంలో ఇలా తండ్రి కూడా చనిపోవడంతో ఆమె కుటుంబంతో పాటు కర్నూలు జిల్లాలోనూ తీవ్ర విషాదం నెలకొంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications