ఏపీలో కూటమి పాలనకు ఏడాది-నెరవేర్చిన హామీల చిట్టా ఇదే..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తయింది. గతేడాది ఇదే రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో భారీ ఎత్తున హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు.. గత ఏడాది పాలనలో వాటిని ఎంత మేరకు నెరవేర్చారన్న దానిపై రాష్ట్రంలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హామీల అమలును ఓసారి చూద్దాం..
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకూ 142 హామీల్ని నెరవేర్చినట్లు అధికార పార్టీలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి నెరవేర్చిన హామీలతో ఓ పోస్టర్ ను కూడా వైరల్ చేస్తున్నాయి. ఇందులో ముందుగా నెరవేర్చిన సూపర్ సిక్స్ హామీ 4 వేలకు పెన్షన్ పెంపుతో ప్రారంభించి పంచాయతీ రాజ్ వ్యవస్థకు పూర్వవైభవం వరకూ మొత్తం 142 హామీలు నెరవేర్చినట్లు చెబుతున్నాయి.

ఈ లెక్కన ప్రభుత్వం నెరవేర్చిన హామీల్లో కీలకంగా పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల పునరుద్దరణ, దీపం 2 పథకంతో ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇవ్వడం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, చెత్త,నాలా పన్నుల రద్దు, రేషన్ షాపుల్లో రేషన్, ఉచిత ఇసుక, కర్నూల్లో హైకోర్టు బెంచ్, ఒకటో తేదీనే ఉద్యోగులకు, పెన్షన్లర్లకు జీతాలు, పెన్షన్ల చెల్లింపు, టీచర్ల 117 జీవో రద్దు, క్రీడాకారులకు ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్, చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విశాఖ రైల్వే జోన్ పనుల ప్రారంభం ఇలా చాలానే ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం కొలువైన ఏడాదిలో 142 హామీలను నెరవేర్చింది. #సుపరిపాలనలోతొలిఅడుగు#FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh#Aditiforvizianagaram #aditigajapathiraju pic.twitter.com/4nc9ZY0qx3
— Aditi Gajapathi Raju (@AditiGajapathi) June 12, 2025
రాష్ట్రంలో సంక్షేమాన్ని పూర్తిగా మూలనపడేశారని విమర్శలు ఎదురవుతున్న వేళ తాజాగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు ప్రభుత్వం సిద్దం కావడం, అలాగే ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చేసిన ప్రకటన వంటివి లబ్దిదారులకు ఊరటనిచ్చే అంశాలే. ఏడాది పాలనలో కీలకమైన హామీల్ని దాదాపుగా నిలబెట్టుకున్న ప్రభుత్వం.. రాబోయే రోజుల్లో వాటిని ఎంత మేర పక్కాగా అమలు చేస్తుందన్న దానిపై కూటమి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications