ప్రత్యేక హోదా కావాల్సిందే: గళమెత్తిన మరో సినీ హీరో
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలపై కుర్ర హీరో నిఖిల్ సిద్ధార్థ స్పందించారుట. కొన్ని ప్రత్యేకమైన సమస్యలపై కేవలం రాజకీయ నాయకులే స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరగడంంతో ఆయన గొంతు విప్పారు. ప్రత్యేక హోదా కావాల్సిందేనని ఆయన అన్నారు.
ఇలా కోరుకుంటున్నాను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నట్లు నిఖిల్ సిద్ధార్థ తెలిపారు. రాష్ట్రాభివృద్ధి ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర నిధుల వల్లనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
కొందరు ఎందుకంటున్ారు...
నీకు ఏపీకి ప్రత్యేక హోదా లాంటి విషయాలు నీకెందుకని కొందరు అంటున్నారని నిఖిల్ సిద్ధార్థ అన్నారు. దీనిపై స్పందిస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ఆయన నటించిన కిర్రాక్ పార్టీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం.
హోదా అవసరం ఎంతైనా ఉంది...
ఏపికి ప్రత్యేక హోదాను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిఖిల్ సిద్ధార్థ అన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక సాయం అందాలన్నా, ఏపి మరింత అభివృద్ది జరగాలన్నా హోదాతోనే సాధ్యమవుతుందని అన్నారు.
తెుగు వ్యక్తిగా, ఓ భారతీయుడిగా...
ఇలాంటి విషయాలు నీకెందుకని కొంత మంది ప్రశ్నిస్తున్నారని నిఖిల్ సిద్ధార్థ అంటూ తెలుగు వ్యక్తిగా, ఓ భారతీయుడిగా తాను అభివృద్దిని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి భార నిధులు వచ్చినప్పుడే ఏపిలో అభివృద్ధికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తోందంటూ ఫొటోను కూడా ట్విట్టర్లో పోస్టు చేశారు.