Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమల లడ్డూ, జగన్ బహిరంగ చర్చకు సిద్దమా, హోం మంత్రి సవాల్

తిరుమల శ్రీవారి లడ్డు తయారీలోకల్తీ నెయ్యి విషయంపై శ్రీ వెంకటేశ్వరస్వామి సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడించారని, తిరుమల శ్రీవారిని కూడా వైసీపీ నాయకులు రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన హోం మంత్రి అనిత జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో అన్ని వ్యవస్థల లాగే తిరుమల లడ్డును కూడా జగన్ కల్తీ చేశారని హోం మంత్రి అనిత ఆరోపించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని హోం మంత్రి అనిత వ్యంగంగా అన్నారు. చేసిన అపరాధానికి ప్రశ్చాతప పడకుండా వైసీపీ నాయకులు బుకాయిస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వం పైన ఎదురుదాడి దిగటానికి ప్రయత్నిస్తున్నారని హోం మంత్రి అనిత ఆరోపించారు.

Home Minister Anitha challenged Jagan to come to a public discussion on adulterated ghee in Tirumala laddus

జగన్ ఇలాగే ప్రవర్తిస్తే పులివెందులలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేడని, అదే పులివెందుల ప్రజల జగన్ ను ఓడిస్తారని హోం మంత్రి అనిత వ్యంగంగా అన్నారు. తిరుమల లడ్డుల నెయ్యి కల్తీపై దమ్ముంటే చర్చకు రావాలని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత వైసీపీ నాయకులకు, జగన్ కు సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కల్తీ చేశారని, చివరికి కోట్లాదిమంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూల తయారీ కోసం కూడా కల్తీ నెయ్యినే ఉపయోగించారని, ఇలాంటి వారిని తన జీవితంలో ఎక్కడా చూడలేదని హోం మంత్రి అనిత ఆరోపించారు.

Home Minister Anitha challenged Jagan to come to a public discussion on adulterated ghee in Tirumala laddus

మా వంద రోజుల పాలనపై జగన్ విమర్శలు చెయ్యడం విడ్డూరంగా ఉందని హోం మంత్రి అనిత అన్నారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి విషయంలో మీరు తప్పు చెయ్యకపోతే బహిరంగ చర్చకు రావాలని జగన్ కు హోం మంత్రి అనిత సవాలు విసిరారు. ఇప్పటికైనా చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలని, అంతేకానీ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించరని హోం మంత్రి అనిత అన్నారు.

మంత్రిగా పనిచేసిన ఆర్ కే రోజా తిరుమల వీఐపీ దర్శనం టికెట్లు అమ్మ పోలేదా ? అని హోం మంత్రి అనిత వైసీపీ నాయకుల్ని ప్రశ్నించారు. తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాపై విచారణ జరిపించి తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత వైసీపీ నాయకులు హెచ్చరించారు. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీ నాయకులను ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడని, ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని హోం మంత్రి అనిత అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+