వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని , బండరాయితో మోదారు,చివరికిలా
వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భావించింది భార్య, అయితే భర్తను ప్రియుడు చంపేశాడు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకొంది.
కర్నూల్ :వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భార్య ప్రియుడు భర్తను హత్య చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకొంది.నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
కర్నూల్ జిల్లాలోని వెంకటనాయుడిపల్లె గ్రామానికిచెందిన రామచంద్రుడు, నాగమద్దమ్మ దంపతులు పట్టణంలోని సమీపంలోని పేరంటాలమ్మ గుడి వద్ద ఇటుకల బట్టీ ఫ్యాక్టరీలో పనిచేసేవారు.
ఇదే ఇటుకల బట్టీలో కృష్ణగిరి మండలంలోని ఎస్ హెచ్ ఎర్రగుడి గ్రామానికిచెందిన తిమ్మరాజు పనిచేస్తున్నాడు. అయితే నాగముద్దమ్మతో తిమ్మరాజుకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం భర్త రామచంద్రుడికి తెలిసింది. దీంతో తరచూ రామచంద్రుడు, తిమ్మరాజులు గొడవపడుతుండేవారు. తమ మద్య వివాహేతర సంబంధానికి రామచంద్రుడు అడ్డుగా ఉన్నాడని భావించాడు.రామచంద్రుడిని చంపేయాలని భావించారు.
గత ఏడాది డిసెంబర్ 27వ, తేదిన తిమ్మరాజు తన బైక్ పై రామచంద్రుడిని తీసుకెళ్ళి మద్యం తాగించాడు ఎర్రగుంట్ల సమీపంలోని కొండల్లోకి తీసుకెళ్ళాడు.
మద్యం మత్తులో ఉన్న రామచంద్రుడు తలపై రాయితో మోది చంపేశాడు తిమ్మరాజు.రామచంద్రుడు మృతదేహన్ని చూసిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసుల విచారణలో తిమ్మరాజు రామచంద్రుడును హత్య చేశారని తేలింది.నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు