గాల్లో చక్కర్లు కొట్టిన ప్లేన్: అదే విమానంలో సీఎం జగన్ తల్లి విజయమ్మ
విజయవాడ: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షాలతోపాటు గాలులు కూడా బలంగా వీచాయి. దీంతో ఓ విమానం గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించక గాల్లోనే చక్కర్లు కొట్టింది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన ఇండిగో విమానం.. ఇక్కడ వాతావరణ పరిస్థితిలు అనుకూలించకపోవడంతో ల్యాండ్ కాలేదు. అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని ల్యాండ్ చేయకుండా గాల్లోని కాసేపు చక్కర్లు కొట్టించారు.

కాగా, ఈ విమానంలో పలువురు ప్రయాణికులతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి కూడా ఉన్నారు. అయితే, కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన ఈ విమానం.. వాతావరణం పరిస్థితులు సానుకూలంగా మారడంతో విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు.
ఏమవుతుందోనని ఆందోళన చెందిన విమానాశ్రయంలోని ప్రయాణికులు విమానం సేఫ్ గా ల్యాండ్ అవడంతో ఊపిరిపీల్చుకున్నారు. కాగా, మంగళవారం ఉదయం నుంచీ కూడా కృష్ణా జిల్లాలో భారీ వర్షంతోపాటు ఈదురుగాలులు వీస్తున్నాయి.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications