సానియాకు కోట్లు ఇస్తూ: కెసిఆర్ను కడిగేసిన ఇంద్రసేన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి కావడం దౌర్బాగ్యమని బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియా సమావేశంలో కెసిఆర్పై తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఆంధ్రావాళ్లను తిడితే తెలంగాణవాళ్లకు కడుపు నిండదని ఇంద్రసేనా రెడ్డి అన్నారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు కోట్లు ఇస్తున్నారు కానీ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించడం లేదని ఆయన విమర్శించారు.
ప్రైవేట్ కాలేజీలతో కెసిఆర్ కుమ్మక్కయ్యారని ఇంద్రసేనా రెడ్డి ఆరోపించారు. పనిచేయని సర్పంచ్లను తొలగిస్తామంటున్న కెసిఆర్ తను పని చేస్తున్నాడో లేదో తెలుసుకోవాలని ఇంద్రసేనారెడ్డి దుయ్యబట్టారు. కెసిఆర్ రాజకీయాలపై కాకుండా అభివృద్ధిపై ఆలోచన చేయాలని ఆయన హితవు పలికారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్వాళ్లవ సమస్యలను పరిష్కరించాలని ఆయన కెసిఆర్కు సూచించారు. రాష్ట్రంలోని సమస్యలన్నింటినీ కెసిఆర్ గాలికి వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. బోధనా రుసుములు చెల్లించడానికి అధికారులు లభించడం లేదా అని ఆయన అడిగారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications