బాత్ రూంకు కూడా వెళ్లొద్దా: జగన్, వెంట నలుగురైదుగురెందుకు: యనమల
ఏపీ అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య మంగళవారం నాడు ఆసక్తికర చర్చ జరిగింది.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య మంగళవారం నాడు ఆసక్తికర చర్చ జరిగింది.
ఓ సమయంలో జగన్ సభలో లేరు. ఆ తర్వాత ఆయన సభకు వచ్చారు. జగన్ సభలో లేకపోవడాన్ని యనమల ప్రశ్నించారు. దీనిపై జగన్ తనదైన శైలిలో స్పందించారు. బాత్ రూంకు కూడా వెళ్లవద్దా అని అడిగారు. వెళ్లేటప్పుడు ఇలా చూపించి (వేలు చూపిస్తూ) వెళ్లాలని తనకు తెలియదన్నారు.
దానికి యనమల మాట్లాడుతూ.. బాత్ రూంకు అయిదే నలుగురైదుగురు ఎందుకు అని అడిగారు. కావాలనే జగన్ వెళ్లిపోయారన్నారు. మీరు ఇలా చూపిస్తారా (వేలు చూపిస్తూ) ఇలా చూపిస్తారా (మరోవేలు చూపిస్తూ) మీ ఇష్టమన్నారు. హైదరాబాదులో కూడా ఇలాగే చేశారన్నారు.

జగన్ మాట్లాడుతూ.. ఇప్పుడే తనకు తెలిసిందని, చంద్రబాబు నాయుడు తన మనవడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లారని అన్నారు.
దానికి యనమల స్పందిస్తూ... ముఖ్యమంత్రి ముందే అనుమతి తీసుకున్నారని తెలిపారు. సభకు అతి ఎక్కువ సమయం కేటాయిస్తున్న వ్యక్తిని తానేనని గొప్పగా చెబుతున్నానని జగన్ అన్నారు. వినేవాడు ఉంటే ఏదైనా చెప్పవచ్చునని వ్యాఖ్యానించారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications