బాత్ రూంకు కూడా వెళ్లొద్దా: జగన్, వెంట నలుగురైదుగురెందుకు: యనమల
ఏపీ అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య మంగళవారం నాడు ఆసక్తికర చర్చ జరిగింది.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య మంగళవారం నాడు ఆసక్తికర చర్చ జరిగింది.
ఓ సమయంలో జగన్ సభలో లేరు. ఆ తర్వాత ఆయన సభకు వచ్చారు. జగన్ సభలో లేకపోవడాన్ని యనమల ప్రశ్నించారు. దీనిపై జగన్ తనదైన శైలిలో స్పందించారు. బాత్ రూంకు కూడా వెళ్లవద్దా అని అడిగారు. వెళ్లేటప్పుడు ఇలా చూపించి (వేలు చూపిస్తూ) వెళ్లాలని తనకు తెలియదన్నారు.
దానికి యనమల మాట్లాడుతూ.. బాత్ రూంకు అయిదే నలుగురైదుగురు ఎందుకు అని అడిగారు. కావాలనే జగన్ వెళ్లిపోయారన్నారు. మీరు ఇలా చూపిస్తారా (వేలు చూపిస్తూ) ఇలా చూపిస్తారా (మరోవేలు చూపిస్తూ) మీ ఇష్టమన్నారు. హైదరాబాదులో కూడా ఇలాగే చేశారన్నారు.

జగన్ మాట్లాడుతూ.. ఇప్పుడే తనకు తెలిసిందని, చంద్రబాబు నాయుడు తన మనవడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లారని అన్నారు.
దానికి యనమల స్పందిస్తూ... ముఖ్యమంత్రి ముందే అనుమతి తీసుకున్నారని తెలిపారు. సభకు అతి ఎక్కువ సమయం కేటాయిస్తున్న వ్యక్తిని తానేనని గొప్పగా చెబుతున్నానని జగన్ అన్నారు. వినేవాడు ఉంటే ఏదైనా చెప్పవచ్చునని వ్యాఖ్యానించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications