కోడి కత్తి కేసులో మరో ట్విస్ట్- విచారిస్తున్న జడ్జి బదిలీ...
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు కేసుల దర్యాప్తులు, కోర్టుల విచారణలు, తీర్పులు ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఏ చిన్న నిర్ణయమైనా రాజకీయంగా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉండటంతో జనం కూడా వీటిని డేగ కన్నుతో చూస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో వైఎస్ జగన్ కోడి కత్తి కేసు విచారిస్తున్న న్యాయమూర్తి బదిలీ అయ్యారు. కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.
ఏపీలో పలువురు న్యాయమూర్తుల్ని హైకోర్టు తాజాగా బదిలీ చేసింది. ఇందులో పలు జిల్లా కోర్టుల జడ్జీలతో పాటు ఇతర న్యాయస్ధానాల్లో విధులు నిర్వర్తిస్తున్న జడ్జీలు కూడా ఉన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం మూడు జిల్లాల జడ్జీలు బదిలీ అయ్యారు.

మరికొందరు అదనపు జడ్జీలు కూడా బదిలీ అయ్యారు. హైకోర్టు రిజిస్టార్ (విజిలెన్స్) గంధం సునీత తూర్పుగోదావరి జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మిన్) ఆలపాటి గిరిధర్ విశాఖ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. విశాఖ జిల్లా జడ్జిని అదే జిల్లాలోని వ్యాట్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఛైర్మన్ గా బదిలీ చేశారు.
ఇదే క్రమంలో వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి కేసు విచారిస్తున్న విజయవాడ సెషన్స్ కోర్టు జడ్డి శ్రీనివాస ఆంజనేయమూర్తి కూడా బదిలీ అయ్యారు. ఆయన్ను కడప జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. దీంతో విజయవాడ సెషన్స్ కోర్టు జడ్డిగా మూడో అదనపు కోర్టు జడ్జిగా ఉన్న ఎ. సత్యానంద్ వచ్చారు. ఇప్పుడు సత్యానంద్ ఈ కోడి కత్తి కేసు విచారణ కొనసాగించాల్సి ఉంటుంది. దీంతో కేసు విచారణ ఆలస్యమయ్యే అవకాశాలూ లేకపోలేదు.
రాష్ట్రవ్యాప్తంగా పలు కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు. ముఖ్యంగా అదనపు జడ్డీలుగా పనిచేస్తున్న వారు, అదనపు సెషన్స్ కోర్టుల్లో జడ్జీలుగా ఉన్న వారిని కూడా అదే జిల్లాలతో పాటు పలు ఇతర జిల్లాలకు కూడా బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా బదిలీలు అయిన వారంతా మే 1 లోపు కొత్త స్ధానాల్లో చేరాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
-
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు












Click it and Unblock the Notifications