వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్‌లో అసలు ముఖ్యమంత్రి ఉన్నారా?: బొత్స నిప్పులు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. సీఎం చంద్రబాబు నాయుడు అండర్‌గ్రౌండ్‌లో ఉంటారా? అని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.

మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టి నాలుగు రోజులు అవుతున్నా.. ముఖ్యమంత్రి ఎందుకు ఢిల్లీలో పోరాటం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజల ముందుకు చంద్రబాబు ఎందుకు రావడం లేదని నిలదీశారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు నిరసన తెలుపుతున్నారని, వారు మాటల్లో కాదు.. నిరసనను చేతల్లో చూపించాలని బొత్స సూచించారు.

Is there CM for Andhra Pradesh: Botsa Satyanarayana Slams Chandrababu Naidu

నాలుగేళ్లు బీజేపీతో సహవాసం చేసి రాష్ట్రానికి ఏం మేలు చేశారని బొత్స ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అడిగిన ప్రశ్నలపై చంద్రబాబు కావాలంటే స్వయంగా సీబీఐ విచారణ జరిపించుకోవాలన్నారు.

చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. విభజన హామీల విషయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీపడే ప్రసక్తే లేదని, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

English summary
Is there CM for Andhra Pradesh? YSRCP leader Botsa Satyanarayana questioned on Tuesday. While speaking with press reporters he fired on CM Chandrababu Naidu over Union Budget. Why Chandrababu Naidu is not figiht against BJP? he questioned. What is the use of alliance with BJP per the past 4 years, Botsa Asked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X