ఓడినా విచారం లేదు: సీఎం జగన్ వ్యాఖ్యలు; వైసీపీ ప్యాకప్: లోకేష్ సెటైర్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి జరగనున్న ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న క్రమంలో తాజాగా ఇండియా టుడే సమ్మిట్లో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ తో జరిపిన సంభాషణలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు ఓటముల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీడీపీకి జగన్ ను టార్గెట్ చెయ్యటానికి ఆయుధం అయ్యాయి.
సీఎం జగన్ తాను ఇచ్చిన హామీల్లో దాదాపు అన్ని హామీలను నెరవేర్చానని.. కాబట్టి తను ఓడిపోయిన తనకు విచారం లేదని, తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్ గా మారింది. ఈ వ్యాఖ్యలను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కెసిఆర్ చేసిన వ్యాఖ్యలతో పోల్చి తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నారు.

కెసిఆర్ కూడా ఎన్నికలకు ముందు నేను ఓడిపోతే మీకే నష్టం.. నాకేం నష్టం అంటూ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నాయకులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓడిన విచారణ లేదంటూ ఇప్పటికిప్పుడు సంతోషంగా దిగి పోతానని జగన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేసారు అని వైసిపి ప్యాకప్ అవుతుందంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. 2024లో జగన్ ఇక ఉండరని, ఈ ఏడాదికి బై బై జగన్ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీలో భయం కనిపిస్తుందన్నారు.
వై నాట్ 175 అంటూ ఇన్నాళ్లు ప్రచారం చేసుకున్న జగన్ ఇప్పుడు మళ్లీ స్వరం మారుస్తున్నారని లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు జగన్ ఓడినా బాధ లేదని మాట్లాడడంతో జగన్ కు రియాలిటీ అర్థమయ్యే ఈ మాట మాట్లాడుతున్నారని టిడిపి శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. గెలుస్తామని ధీమా ఉన్నవాళ్లు ఇలా మాట్లాడరని సోషల్ మీడియా వేదికగా చర్చ పెడుతున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications