జగన్..నీ ఎమ్మెల్యేను నా మీద గెలిపించు: పాదాభివందనం చేస్తా: జలీల్ ఖాన్ సవాల్..!
మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ముఖ్యమంత్రి జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని విషయంలో జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారుని మండిపడ్డారు. కళ్ళు ఉన్నవాడు.. కడుపుకి అన్నం తింటున్న వాడు రాజధాని మారుస్తా అని అనడంటూ తీవ్రంగా స్పందించారు. పరిపాలన అంతా ఒక దగ్గర నుండే జరగాలని డిమాండ్ చేసారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన ఆయన.. సీఎం
జగన్ పతనానికి తానే నాంది పలికాడంటూ వ్యాఖ్యానించారు. అమరావతి లో రైతు సోదరులు..మహిళలు పోరాడుతున్నారని...వాళ్ళకి 13 జిల్లాల రైతులు..మహిళలు మద్దతు పలకాలిని జలీల్ ఖాన్ సూచించారు.
విశాఖ లో ప్రభుత్వ భూములు.. క్రిస్టియన్ సంస్థల భూముల మీద జగన్ కన్ను పడిందంటూ జలీల్ ఖాన్ ఆరోపించారు.
జగన్ కు జలీల్ ఖాన్ సవాల్...
2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే విజయవాడ పశ్చిమం నుండి జలీల్ ఖాన్ గెలిచారు. ఆ తరువాత టీడీపీలోని ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా టీడీపీ నుండి జలీల్ ఖాన్ కుమార్తె పోటీకి దిగారు. అక్కడ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస రావు గెలుపొంది..జగన్ మంత్రి వర్గంలో మంత్రి అయ్యారు. ఇప్పుడు, రాజధాని వ్యవహారం పైన స్పందించిన జలీల్ ఖాన్ సీఎంకు సవాల్ చేసారు.
జగన్ నీ ఎమ్మెల్యే ని రాజీనామా చేపించి...నా మీద పోటీ చేపించి గెలిపించు..ప్రజలు నీ వైపు ఉన్నారని నిరూపించు..అంటూ సవాల్ చేసారు. నీ పరిపాలన మీద ప్రజలు ఏమంటున్నారో తెలుసుకో....అంటూ కామెంట్ చేసారు.

పాదాభివందనం చేస్తా...నెత్తిన నీరు చల్లుకుంటా
ఒక్క చాన్స్ ఇవ్వండి ఏపీ ని ఇంద్ర లోకం చేస్తా అన్నాడంటూ సీఎం ను జలీల్ ఎద్దేవా చేసారు. హై పవర్ కమిటీ అంటే మేధావులు.. రిటైర్ జడ్జి లు ఉంటారు...గొర్రెల మందలా మీ మనుషులే ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బోస్టన్ కమిటీ కి రాజధాని పై అసలు అవగాహనా ఉందా అని ప్రశ్నించారు. మహిళలను రైతులను ఇబ్బంది పెడితే దేవుడు చూస్తూ ఉరుకోడని చెప్పుకొచ్చారు. అదే సమయంలో అమరావతి నుండి రాజధాని మార్చకుండా ఉంటే జగన్ కి పాదాభివందనం చేస్తా...నెత్తిన నీరు చల్లు కుంటా నంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. పరిపాలన అంతా ఒకే దగ్గర నుంచి జరగాలన్నారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్కు పాదాభివందనం చేస్తానన్నారు. జగన్ అంటే ఉద్యోగులు భయపడుతున్నారన్నారు. అందుకే ఉద్యోగులు సైలెంట్ అయ్యారని జలీల్ఖాన్ పేర్కొన్నారు.
-
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications