వైసీపీ తప్పుకొన్న వేళ.. జనసేన ఎమ్మెల్యేకే వరించిన కీలక పదవి
Pulaparthi Ramanjaneyulu: ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఎంపిక వ్యవహారానికి తెరపడింది. ఈ కీలక పదవిని జనసేన దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన భీమవరం శాసన సభ్యుడు పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు.. పీఏసీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. మరో ఎనిమిది మంది సభ్యులుగా నామినేట్ అయ్యారు.
సాధారణంగా ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్.. పదవిని అధికార పార్టీ- ప్రతిపక్షానికి కేటాయిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. 2019లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ హోదాను తెలుగుదేశానికి అప్పగించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇప్పటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పీఏసీ ఛైర్మన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఇప్పడు ఆ సంప్రదాయానికి తెరపడింది. ప్రతిపక్ష హోదా లేకపోవడం, సభ ఆశించిన స్థాయిలో సంఖ్యా బలం లేకపోవడం వంటి పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీకి ఈ పదవి దక్కలేదు. అధికార కూటమిలో కీలక భాగస్వామిగా, 21 మంది శాసన సభ్యుల బలం ఉన్న జనసేనకే ఇది వరించింది.
పీఏసీ ఛైర్మన్ హోదా దక్కించుకోవాలంటే సభలో కనీసం 18 మంది సభ్యుల బలం అవసరమౌతుంది. బలం లేనప్పటికీ ఈ హోదా కోసం తొలుత వైఎస్ఆర్సీపీ పోటీ పడింది. సీనియర్ సభ్యుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ సైతం దాఖలు చేశారు. పోటీ తప్పదనుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ అనూహ్యంగా వెనక్కి తగ్గింది. ఈ ఎన్నికలను బహిష్కరించింది.
కాగా- ఇప్పుడు తాజాగా పీఏసీలో సభ్యులుగా శ్రీరామ్ రాజగోపాల్ (టీడీపీ- జగ్గయ్యపేట), బీవీ జయ నాగేశ్వర్రెడ్డి (టీడీపీ- ఎమ్మిగనూరు), అరిమిల్లి రాధాకృష్ణ (టీడీపీ- తణుకు), ముత్తుముళ్ల అశోక్ రెడ్డి (గిద్దలూరు), బూర్ల ఆంజనేయులు (టీడీపీ- ప్రత్తిపాడు), నక్కా ఆనంద్ బాబు (టీడీపీ- వేమూరు), కోళ్ల లలితకుమారి (టీడీపీ- శృంగవరపు కోట), విష్ణుకుమార్ రాజు (బీజేపీ- విశాఖపట్నం నార్త్) ఎన్నికయ్యారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications