తిట్టినందుకు షోకాజ్ అందిందన్న జెసి, 4 రోజుల్లో చెప్తా
హైదరాబాద్: తనకు షోకాజ్ నోటీసు అందిందని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన విమర్శలు చేసినందుకు, వారిని తిట్టినందుకు పార్టీ అధిష్టానం తనకు నోటీసులు ఇచ్చిందని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసన సభ్యులు జెసి దివాకర్ రెడ్డి బుధవారం అన్నారు.
తనకు వచ్చిన షోకాజ్ నోటీసులో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారని జెసి చెప్పారు. తాను నాలుగు రోజుల్లోనే స్పందిస్తానని తెలిపారు.
కాగా, రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సోనియా, రాహుల్ల పైన విమర్శలు చేశారు. సోనియా బాధ్యతల నుండి తప్పుకోవాలని జెసి డిమాండ్ చేశారు. జెసి వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీలో వేడిని రాజేశాయి. జెసి వ్యాఖ్యలపై ఇరు ప్రాంతాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జెసి పైన చర్యలు తీసుకోవాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అధిష్టానానికి లేఖ రాశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పలుమార్లు స్పందించారు. జెసికి నోటీసులు పంపించామని చెప్పారు. నిన్నటి వరకు తనకు నోటీసులు చేరలేదని చెప్పిన జెసి ఇప్పుడు వచ్చాయన్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications