వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్ మనీ, అసెంబ్లీ తీరుపై జెపి అసహనం: 'చంద్రబాబు ప్రై. లిమిటెడా'

By Srinivas
|
Google Oneindia TeluguNews

అనంతపురం: కాల్ మనీ వ్యవహారంలో మహిళలను తీవ్రంగా అవమానించడం దారుణమని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ మనీ మూలాల్లోకి వెళ్లి విచారణ చేయాలని, పైపైన చేస్తే లాభం లేదన్నారు.

అసెంబ్లీ సమావేశాల తీరుపై మాట్లాడుతూ... సమావేశాలు ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. నవుబాటుకు గురవుతున్నాయన్నారు. రాజకీయాలంటే ద్వేషం కలిగేలా చేస్తున్నారన్నారు. రాజకీయాలను వ్యాపారం చేశారని, రాజకీయ అండ చూసుకొని బ్లాక్ మెయిల్, బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్సించారు.

JP unhappy with Assembly proceedings

ప్రభుత్వమా, చంద్రబాబు ప్రై.లిమిటెడా?: శైలజానాథ్

ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగితే వారి పైన చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని పీసీసీ ఉపాధ్యక్షులు శైలజానాథ్ మండిపడ్డారు. అంగన్వాడీల పైన టిడిపి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు.

ఆందోళనలో పాల్గొన్న అంగన్వాడీల తొలగింపు జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం అన్ని ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలన్నారు.

English summary
Jayaprakash Narayana unhappy with Assembly proceedings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X