రీ ఎంట్రీ ఇచ్చిన కేఏ పాల్ ... కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పై హైకోర్టులో పిటీషన్ పాల్ ... నేడే విచారణ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. పొలిటికల్ సెటైరికల్ గా తెర మీదికి రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇక తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై కెఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై కోర్టుకెక్కిన కేఏ పాల్
గత ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేసిన పాల్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన కె ఏ పాల్ రాంగోపాల్ వర్మ పుణ్యమాని మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ ఇప్పటికే విడుదలయ్యాయి .వాటిలో కేఏ పాల్ ను జాఫర్ ఇంటర్వ్యూ చేస్తున్నట్లు గా ఉన్న సీన్ నేపథ్యంలో, సినిమాలో తన అనుమతి లేకుండా తనను సైతం టార్గెట్ చేసిన తీరుపై కే ఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు.

సినిమా ఆపాలని కోర్టును కోరిన కేఏ పాల్
ఈనెల 29న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని రాంగోపాల్ వర్మ చెబుతున్న నేపథ్యంలో ఆ సినిమా ఆపివేయాలని కేపాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను, సెన్సార్ బోర్డును, రాంగోపాల్ వర్మను అలాగే జబర్దస్త్ కమెడియన్ రాము తదితరులను చేర్చారు.

నేడు కోర్టులో కేఏ పాల్ పిటీషన్ పై విచారణ
నేడు ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే రాంగోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం తీస్తానని చెప్పి నాటినుండి నేటి వరకు అన్ని కాంట్రవర్సీ లే. ఆ సినిమా పేరు నుండి సినిమాలోని కంటెంట్ వరకు ప్రతి దానిపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కె ఏ పాల్ వేసిన పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ ఏ విధంగా జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. కోర్టు కేఏపాల్ పిటిషన్ విషయంలో ఏం చెప్తుంది అనేది తెలియాల్సి ఉంది.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సీక్వెల్ కూడా తీస్తానంటున్న వర్మ
ఎవరు ఎన్ని కేసులు వేసినా, ఎంత విమర్శలు చేసినా ఏ సినిమా తీసిన వివాదాస్పద కథనే ఎంచుకునే వర్మ ఇప్పటికే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాను తన శిష్యుడు సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్స్, సాంగ్స్కు మంచి రెస్పాన్సే వచ్చిందని భావిస్తున్న వర్మ ఇప్పటికే రిలీజ్కు రెడీగా ఉన్న ఈ సినిమాకు రీసెంట్ గా సీక్వెల్ ప్రకటించాడు. తాజాగా వల్లభనేని వంశీ ఇంటర్వ్యూల్లో తిడుతున్న తిట్లను చూస్తే తనకో ఆలోచన వచ్చిందని.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'కు సీక్వెల్ తీయాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు వర్మ. దానికి ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్' అనే టైటిల్ పెట్టబోతున్నానని వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications