కేఎ పాల్ నామినేషన్ ఆమోదం : ఒకటికాదు రెండు చోట్ల
Recommended Video

హైదరాబాద్ : ఎట్టకేలకు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ నామినేషన్లు ఆమోదం లభించింది. పాల్ తొలుత నరసాపురం లోక్సభ స్థానానికి నామినేషన్ వేశారు. ఇక్కడ ఇబ్బందులేం లేవు. కానీ ఆస్తుల వివరాలు చూపలేదని ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే పరిశీలనలో మాత్రం అన్ని సరిగ్గా ఉండడంతో అభ్యంతరాలు తెలుపడానికి వీలులేకుండా పోయింది.
భీమవరం అసెంబ్లీ కూడా ..
భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి నిన్న కేఏ పాల్ నామినేషన్ వేసేందుకు వెళ్లారు. మధ్యాహ్నాం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఆయన సమయం ముగిసే సమయంలో వెళ్లడంతో రిటర్నింగ్ అధికారి పాల్ నామినేషన్ను నిరాకరించారు. దీనిపై మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లను పరిశీలించారు. డాక్యుమెంట్స్ అన్నీ సరిగా ఉండటంతో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ నామినేషన్కు ఆమోదం తెలిపారు.

రెండుచోట్ల బరిలోకి ...
మొత్తానికి కేఏ పాల్ నరసాపురం లోక్సభ, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీలో ఉన్నారు. తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు పాల్. విపక్ష వైసీపీతోపాటు, జనసేన, అధికార టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకదు తమ పార్టీ అభ్యర్థుల విజయంపై కూడా విశ్వాసంతో ఉన్నారాయన.












Click it and Unblock the Notifications