జోగయ్య, ముద్రగడ అజెండా క్లియర్ ? నిన్న అలా.. ఇవాళ ఇలా..!
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి ఎన్నికల్లో పోరాడతామని మూడేళ్ల క్రితమే ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అందుకు తగ్గట్టే బీజేపీతో ఉంటూనే టీడీపీతో జట్టు కట్టారు. ఇప్పుడు ఈ రెండు పార్టీల్ని కలుపుకుని ఎన్నికల్లో ఉమ్మడి పోటీకి సిద్దమవుతున్నారు. అయితే పొత్తుల్లో భాగంగా జనసేన తీసుకున్న సీట్ల వ్యవహారంలో కాపు నేతలు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం .. నిత్యం పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. కాపుల పేరుతో వీరు పవన్ ను టార్గెట్ చేయడంలో తప్పు లేకపోయినా ఇప్పుడు వారి వారసులు వైసీపీ గడప తొక్కుతుండటంతో అనుమానాలు మొదలయ్యాయి.
నిన్న మొన్నటి వరకూ హరిరామ జోగయ్య టీడీపీతో పొత్తు పెట్టుకున్నా అధికారంలో భాగస్వామి కావాలని, టీడీపీతో సమానంగా సీట్లు కోరాలంటూ పవన్ పై ఒత్తిడి పెంచారు. ఆ తర్వాత టీడీపీ జనసేన అభ్యర్ధుల ప్రకటన రావడంతో 24 సీట్ల కేటాయింపుపై భగ్గుమన్నారు. మధ్యలో ఓసారి పవన్ తో కలిసి టీడీపీ ముందు పెట్టాల్సిన డిమాండ్లు చెప్పేశారు. చివరికి అవి కాస్తా నెరవేరకపోవడంతో జోగయ్య మీ ఖర్మ అంటూ తేల్చేశారు. ఇప్పుడు పవన్ పార్టీలో ఉన్న తన కుమారుడు సూర్యప్రకాష్ ను వైసీపీలోకి పంపేశారు.

అటు ముద్రగడ గతంలో వైసీపీలోకి చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తాను కోరిన సీట్లు ఇస్తే ఓకే అన్నారు. ఈ మేరకు అంతా అయిపోయిందని భావిస్తున్న తరుణంలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల ప్రకటన తర్వాత సైలెంట్ అయిపోయారు. దీనికి కారణం ముద్రగడ కోరిన సీట్లు ఇవ్వకపోవడమే. దీంతో తిరిగి పవన్ వైపు మొగ్గి లేఖలు రాయడం మొదలుపెట్టారు. పవన్ తన దగ్గరికి వస్తానని రాకపోవడంతో అలిగారు. చివరికి వైసీపీలోకి వెళ్లేందుకు తిరిగి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆయన కుమారుడు చల్లారావు భవిష్యత్తు కోసం పిఠాపురం సీటుపై సంప్రదింపులు చేస్తున్నారు.
ఇలా అయితే జనసేన లేదంటే వైసీపీ అన్నట్లుగా సాగుతున్న కాపు నేతలు ముద్రగడ, జోగయ్య రాజకీయం ఇప్పుడు కాపుల్లో కుంపటి పెడుతోంది. వీరు ఇన్నాళ్లు చేసిన డిమాండ్లు, పవన్ ముందు పెట్టిన టార్గెట్లు.. ఇప్పుడు వారు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వీరి అజెండాలు వేరే ఉన్నాయనే చర్చ సాగుతోంది. అవేవీ ఫలించకపోవడంతో నేరుగా వైసీపీలో చేరేందుకు సిద్దమైపోతున్నట్లు తెలుస్తోంది. వీలైతే వైసీపీలో నేరుగా చేరడం లేదా తమ వారసుల్ని అక్కడికి పంపేసేందుకు జోగయ్య, ముద్రగడ చేస్తున్న ప్రయత్నాలు కాపుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం!











Click it and Unblock the Notifications