Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సోనియా భజన: జగన్‌పై కెఇ, హైదరాబాద్‌పై సోమిరెడ్డి

 KE Krishna Murthy
కర్నూలు/ హైదరాబాద్ : తెలంగాణ ముసాయిదా బిల్లులో రాయలసీమకు జరిగిన అన్యాయంపై తాము ఉద్యమిస్తామి తెలుగుదేశం రాయలసీమ ప్రాంత నాయకుడు కెఇ కృష్ణమూర్తి చెప్పారు. కర్నూలులో ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయన ప్రాంతాల ప్రజల మనోభావాలను సభలో వినిపించే స్వేచ్ఛను తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కల్పించినట్లు ఆయన తెలిపారు.

బిజెపితో కలిసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. హైదరాబాదులో విభజన, ఢిల్లీలో సోనియా భజనతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ తరిస్తున్నారని ఆయన అన్నారు. సమైక్య పక్షమో, సోనియా పక్షమో జగన్ స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారమే పరమావధిగా జగన్ ముందుకు వెళ్తున్నారని ఆయన విమర్శించారు. విభజన జరిగితే మూడేళ్లలో రాయలసీమ ప్రత్యేక ఉద్యమం తీవ్రంగా వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర విభజన బిల్లు తప్పులతడకగా ఉందని తెలుగుదేశం సీమాంధ్ర నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ అంశంపై ముందుకు రావాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కోరారు.

తెలంగాణ ముసాయిదా బిల్లులో ఉన్న తప్పులను ఎవరూ పట్టించునకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నాయకులు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకుని, హైదరాబాద్ ప్రాముఖ్యతను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన జరిగిన మరుక్షణం హైదరాబాద్‌పై ఎలాంటి చట్టపరమైన హక్కు లేకుండా పోతుందని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+