'పుష్కరాల్లోపు దుర్గగుడి ప్లైఓవర్ నిర్మించి చూపిస్తాం'
విజయవాడ: వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాల్లోపు దుర్గగుడి ప్లైఓవర్ను నిర్మించి చూపిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని చెప్పారు. నగరంలోని కనకదుర్గ గుడి వద్ద ప్లైఓవర్ పనులు అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైవే పక్కనున్న ఇళ్లను తొలగిస్తున్నారు.
ఈ క్రమంలో ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు సోమవారం ఫ్లైఓవర్ అలైన్మెంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ నాని మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాల్లోపు దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మిస్తామన్నారు.
ఆరు లైన్ల ఫ్లైఓవర్ కింద నాలుగులైన్ల రోడ్డును వేయనున్నట్ల ఆయన తెలిపారు. త్వరలోనే కేంద్ర రవాణా శాఖమంత్రి మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఫ్లైఓవర్ కు శంకుస్థాపన చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడపై వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో అమరావతిలో లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నారన్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications