'పుష్కరాల్లోపు దుర్గగుడి ప్లైఓవర్ నిర్మించి చూపిస్తాం'
విజయవాడ: వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాల్లోపు దుర్గగుడి ప్లైఓవర్ను నిర్మించి చూపిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని చెప్పారు. నగరంలోని కనకదుర్గ గుడి వద్ద ప్లైఓవర్ పనులు అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైవే పక్కనున్న ఇళ్లను తొలగిస్తున్నారు.
ఈ క్రమంలో ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు సోమవారం ఫ్లైఓవర్ అలైన్మెంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ నాని మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాల్లోపు దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మిస్తామన్నారు.
ఆరు లైన్ల ఫ్లైఓవర్ కింద నాలుగులైన్ల రోడ్డును వేయనున్నట్ల ఆయన తెలిపారు. త్వరలోనే కేంద్ర రవాణా శాఖమంత్రి మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఫ్లైఓవర్ కు శంకుస్థాపన చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడపై వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో అమరావతిలో లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నారన్నారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications