Pawan Kalyan: శారీరక హింస, జీవితాంతం వెంటాడే మానసిక వేదన
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో (కేజీహెచ్) చోటుచేసుకున్న ఓ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను రేకెత్తించింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే గర్భంలో ఉన్న తన శిశువు మృతి చెందిందంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు నేరుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దృష్టికి చేరింది. బాధితురాలి వేదనను స్వయంగా విని చలించిన ఆయన, ఈ ఘటనపై తక్షణమే స్పందిస్తూ మానవీయ కోణంలో చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
శుక్రవారం రాత్రి విశాఖ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో, విమానాశ్రయంలో పట్నాల ఉమాదేవి పవన్ కళ్యాణ్ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ తొలి వారంలో కాన్పు నిమిత్తం కేజీహెచ్లో చేరిన తాను, ఆసుపత్రిలో వైద్యులు మరియు సిబ్బంది నుంచి ఎదుర్కొన్న అనుభవాలు ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయని ఆమె కన్నీటితో వివరించారు.

సాధారణ కాన్పు పేరిట తనను తీవ్ర శారీరక వేదన
కాన్పుకు నిర్ణయించిన గడువు పూర్తయిందని పదేపదే చెప్పినా, సాధారణ కాన్పు పేరిట తనను తీవ్ర శారీరక వేదనకు గురిచేశారని ఆమె ఆరోపించారు. తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసినా, వైద్య సిబ్బంది పట్టించుకోలేదని తెలిపారు. అంతేకాకుండా, తన కుటుంబ సభ్యులతో అమర్యాదగా, అవమానకరంగా ప్రవర్తించారని, తీవ్ర పదజాలంతో దూషించారని ఆమె వాపోయారు.
ప్రసవ సమయంలో తన గుండెలపైకి ఎక్కి కూర్చుని, మానవత్వం లేని రీతిలో వ్యవహరించారని చెబుతూ, ఆ క్షణాలు తన జీవితంలో చెరగని గాయంగా మిగిలిపోయాయని ఉమాదేవి పేర్కొన్నారు. చివరి నిమిషం వరకు సిజేరియన్కు నిర్ణయం తీసుకోకపోవడమే తన శిశువు ప్రాణాలను బలి తీసుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మృత శిశువుకు జన్మనివ్వాల్సి రావడం తనకు జీవితాంతం మానసిక వేదనగా మిగిలిందని చెప్పారు.
జీవితకాలం వెంటాడే మానసిక గాయం..
ఈ ఘటన కేవలం శారీరక బాధతోనే కాకుండా, జీవితకాలం వెంటాడే మానసిక గాయాన్ని మిగిల్చిందని ఆమె పేర్కొన్నారు. తనలాంటి పరిస్థితి మరో మహిళకు ఎదురుకాకూడదని, కేజీహెచ్లో వైద్యులు మరియు సిబ్బంది నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
బాధిత మహిళ వేదనను శ్రద్ధగా విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా చలించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనను అత్యంత సున్నితంగా పరిగణించి, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తగిన భరోసా ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు బాధిత మహిళను ఆమె కుటుంబ సభ్యులతో సహా సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయానికి రావాలని అధికారులను ఆదేశించారు.
బాధితురాలితో ప్రత్యక్షంగా మాట్లాడి, గర్భస్థ శిశువు మృతికి దారితీసిన పరిస్థితులు, ఆసుపత్రిలో జరిగిన వ్యవహారంపై లోతైన అవగాహన పొందిన తర్వాత, అవసరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో మానవత్వం, వైద్య నైతిక విలువలపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు సమాజం దృష్టిని ఆకర్షిస్తోంది.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
విశాఖ-చర్లపల్లి ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు-ఇకపై ఇలా..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications