జెపి టూర్పై కొండ్రు: టిజి కారుపై చెప్పు, మీసంతిప్పి..

హైదరాబాదులో మరో సభ: గంటా
ఎపిఎన్జీవోల సభ తరహాలో మరో సభను రాష్ట్ర రాజదాని హైదరాబాదులో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖలో చెప్పారు. ఈ సభలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. నాన్ పొలిటికల్ జెఏసి ఆధ్వర్యంలో ఈ నెల 21వ ఆర్కే బీచ్ తీరంలో జరిగే విశాఖ సమైక్య గర్జన సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రజలే ఉద్య నాయకులుగా నడుస్తున్న ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
టిజికి సెగ
మంత్రి టిజి వెంకటేష్కు కర్నూలులో సమైక్య సెగ తగిలింది. శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహం వద్ద టిజిని న్యాయవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను వెనక్కి వెళ్లాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో కొందరు ఆయన వాహనంపై దాడి చేశారు. కాన్వాయ్ పైన చెప్పులు విసిరారు.
సమైక్యాంధ్ర కోసం తన రాజీనామాకు న్యాయవాదులు డిమాండ్ చేస్తూ అడ్డుకోవడంతో కారులో నుండి దిగిన టిజి వెంకటేష్ తాను మొదటి నుండి సమైక్యాంధ్రనే కోరుకుంటున్నానని చెప్పారు. తన కారు నుండి బయటకు వచ్చిన ఆయన మీసం తిప్పారు. కాగా, టిజి వెంకటేష్ కనిపించడం లేదంటూ నగరంలో పోస్టర్లు వేశారు. ఆయన ఇంటి వద్ద, హోటల్ వద్ద సమైక్యవాదులు ఆందోళనకు దిగారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications