ప్రభాస్ రాజకీయాల్లోకి..?: కృష్ణంరాజు స్పందన ఇది, ‘పవన్, జగన్ సభలకు జనాలు వస్తారు కానీ..’
Recommended Video

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాపం పండే రోజు దగ్గరలోనే ఉందని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. విజయవాడలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారని కృష్ణంరాజు మండిపడ్డారు. ప్రతీ పనిలోనూ టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.

ఎక్కడ్నుంచైనా పోటీ..
బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు వల్ల నష్టపోయామని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, నిజానికి బీజేపీతో పొత్తు వల్లే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని కృష్ణంరాజు చెప్పారు.

ప్రభాస్కు ఇంకా సమయం ఉంది..
ప్రముఖ టాలీవుడ్ హీరో, తన సోదరుడి కుమారుడు ప్రభాస్ రాజకీయ రంగ ప్రవేశంపై కృష్ణంరాజు స్పందిస్తూ.. దానికి ఇంకా సమయం ఉందన్నారు. ప్రభాస్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి ప్రభాస్ను ఉపయోగించుకునే ఉద్దేశం తమకు లేదని కృష్ణంరాజు స్పష్టం చేశారు.

ప్రభాస్కు అవసరం లేదు
ప్రభాస్ ఎదుగుతున్న నటుడని, మూడున్నరేళ్లు ఎంతో శ్రద్ధతో కష్టపడి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడన్నారు. పదేళ్లతోనే సినిమా జీవితం అయిపోలేదని, ఇంకా పాతికేళ్లు నటించాల్సిన ప్రభాస్కు అప్పుడే రాజకీయాలు అవసరం లేదని చెప్పారు. ప్రభాస్ను ప్రధాని మోడీకి గతంలో కృష్ణంరాజు పరిచయం చేసిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా.. పరిచయాలకు రాజకీయాలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

పవన్ను ఫాలో అవడం లేదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తాను అంతగా ఫాలో అవడంలేదని, ఆ పార్టీ విధివిధానాలేంటి.? ఎన్నికల్లో అజెండా ఏమిటో పవన్ వెల్లడించాక దానిపై స్పందిస్తానని కృష్ణంరాజు తెలిపారు.

పవన్, జగన్ సభలకు జనం వస్తున్నారు కానీ..
పవన్, వైసీపీ అధినేత జగన్ సభలకు భారీగా జనం వస్తున్న విషయాన్ని ప్రస్తావించగా.. సభలకు, యాత్రలకు వచ్చే జనం అందరూ ఓటర్లు కాదని చెప్పారు. రాజీవ్గాంధీ హయాంలో తాను కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తే జనం విపరీతంగా వచ్చారని, కానీ గెలుపు దక్కలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీని విలన్ను చేసేందుకు టీడీపీ ఎంత ప్రయత్నించినా.. ఎన్నికల నాటికి అవన్నీ అబద్ధాలని తెలుస్తాయని కృష్ణంరాజు చెప్పారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ?












Click it and Unblock the Notifications