బిజెపి నేతలకు ముందే తెలుసు..అలా కుప్పకూలిపోతుంది:నోట్ల రద్దుపై కుటుంబరావు సంచలన వ్యాఖ్యలు
అమరావతి:నోట్ల రద్దు గురించి ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు జరిగి నేటితో రెండేళ్లయిన సందర్భంగా అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు.
పెద్ద నోట్ల రద్ద విషయం బిజెపి నేతలకు ముందే తెలుసని కుటుంబరావు ఆరోపించారు. అందువల్ల బీజేపీ నేతలు ముందుగానే నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చుకున్నారని కుటుంబరావు విమర్శించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు చెందిన కో-ఆపరేటివ్ బ్యాంక్ మొదట నాలుగు రోజుల్లోనే అత్యధిక డబ్బును మార్చుకోవడమే అందుకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని నిర్వీర్యం చేస్తోందని, ఫలితంగా అర్జెంటీనా ఆర్ధిక వ్యవస్థ లాగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలే ప్రమాదం ఉందన్నారు.

నోట్ల రద్దే...అతిపెద్ద కుంభకోణం
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పెద్ద నోట్ల రద్దే అత్యంత పెద్ద కుంభకోణమని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అభివర్ణించారు. అమిత్ షాకు చెందిన కో అపరేటివ్ బ్యాంక్ ద్వారా డబ్బులు పెద్ద మొత్తంలో చేతులు మారాయని...ఎలాంటి కుంభకోణం లేకపోతే జేపీసీ ఎందుకు వేయలేదని కుటుంబరావు నిలదీశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక నోట్ల రద్దే అత్యంత పెద్ద కుంభకోణమని కుటుంబరావు అభివర్ణించారు.

కొత్త ప్రభుత్వం...విచారణ
పెద్ద నోట్ల వినియోగం తగ్గించటానికే నోట్ల రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించిందని కానీ ప్రస్తుతం రెండు వేల నోట్లు వినియోగం మాత్రం బాగా దేశంలో ఇప్పుడు నల్లధనం ఇంకా ఎక్కువ అయిపోయిందన్నారు.2019 తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం నోట్ల రద్దు పై తప్పకుండా ఎంక్వయిరి చేస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వం మోసాలపై100 కేసులపై ఛార్జ్ షీట్ విడుదల చేస్తామన్నారు.దేశంలోఇప్పటికి పాత రూ. 1000, 500 ల నోట్లు మారుస్తున్నారని చెప్పారు. కేంద్రంఏ అంశాలను అయితే అరి కడతామని చెప్పారో అవే రెట్టింపు అయ్యాయన్నారు.

కేంద్ర మంత్రి...తప్పు దోవ
కేంద్రం ఇటీవల క్యాపిటల్ వర్డ్ కంపెనీ ద్వారా ఎంఎస్ఎఈ రుణాలు 59 నిమిషాల్లో ఇస్తారంటున్నారని..ఆ ప్రాజెక్ట్ క్యాపిటల్ వర్డ్ కు ఎలా అప్పజెప్పారని నిలదీశారు.షా లు ప్రజలను దోచుకుంటున్నారని...ఈ స్కామ్ లను ఆర్ధిక ఉగ్రవాదులు మాత్రమే చేయగలరని దుయ్యబట్టారు.నోట్ల రద్దుపై కేంద్ర ఆర్థిక మంత్రి ప్రజలను తప్పుదోవ పట్టించారని...నోట్ల రద్దు ఓ పెద్ద డిజాస్టర్ గా కుటుంబరావు అభివర్ణించారు.

కుప్పకూలొచ్చు...ఆయన రాజీనామా
బిజెపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా అడుకోవచ్చు అనేదానికి ఒక ఉదాహరణ అన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఆర్బీఐని నిర్వీర్యం చేస్తూ వస్తోందని...ఫలితంగా అర్జెంటీనా ఆర్ధిక వ్యవస్థ లాగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్బీఐ బోర్డ్ మీటింగ్ త్వరలోనే జరగనుందని...ఆ రోజు ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేసే అవకాశం లేక పోలేదని కుటుంబరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications