తాడిచెట్టుకు వచ్చినట్టు వయసొచ్చింది.. ఏం ప్రయోజనం.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఘాటుగా!!
టిడిపి అధినేత చంద్రబాబుపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెంలో వైయస్సార్ మేధావుల వేదిక, ఏపీ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం అనే అంశంపై జరిగిన సదస్సులో లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకి తాడి చెట్టుకు వచ్చినట్టు 75 ఏళ్లు వచ్చాయి కానీ ఏం ఉపయోగం అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానాను తన సొంత డబ్బు లాగా దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు. ఎవరో అమెరికాలో కనిపెట్టిన సెల్ ఫోన్ ను తానే కనిపెట్టానని, ఎవరో తెచ్చిన ఐటీని తానే తెచ్చానని చెప్పడం చంద్రబాబుకి అలవాటని లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 371 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.

ఆరు నెలల్లో వేల కోట్లు దోచేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అల్లుడు గురించి చెప్పాలంటే అత్తనే చెప్పాలంటూ సెటైర్లు వేసిన లక్ష్మీపార్వతి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమవుతుందని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వెళ్లడం మామూలు విషయం కాదని లక్ష్మీపార్వతి వెల్లడించారు.
గత ప్రభుత్వంలో మూడు వేల పాఠశాలలు మూతపడ్డాయని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు ఫుల్ అవుతున్నాయని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా సీఎం జగన్ సుపరిపాలన చేస్తున్నారని పేర్కొన్న లక్ష్మీపార్వతి వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి 175 కి 175 సీట్లు వస్తాయని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీలో 70 శాతం మంది జగన్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో లబ్ధి పొందుతున్నారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారు కాబట్టి గత ఎన్నికల్లో చంద్రబాబును పక్కన కూర్చోబెట్టారని, 23 సీట్లకే పరిమితం చేశారని లక్ష్మీపార్వతి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ ప్రభుత్వం రావటం ఖాయమన్నారు.
-
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..












Click it and Unblock the Notifications