సాయితేజ అంత్యక్రియలు నేడు - మిలటరీ లాంఛనాలతో : స్వగ్రామంలో విషాదం..!!
తమిళనాడులో జరిగిన ఆర్మీ చాపర్ ప్రమాదంలో మరిణించిన సాయితేజకు ఈ రోజు అంత్యక్రియలు జరగనున్నాయి. బెంగుళూరు నుంచి సాయితేజ స్వగ్రామం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లెకు భౌతికకాయం చేరుతుంది. తొలుత శనివారమే ఈ కార్యక్రమాన్ని ముగించాలని భావించినా.. శనివారం మధ్యాహ్నం సాయతేజ భౌతికకాయం బెంగళూరుకు చేరుతుందని, అనంతరం బెంగళూరు నుంచి తమ స్వగ్రామానికి రావడానికి సాయంత్రమవుతందని పేర్కొన్నారు. దీంతో సాయితేజ అంత్యక్రియలు ఆదివారం ఉదయం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

స్వగ్రామానికి సాయితేజ భౌతిక కాయం
డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలాలకు భౌతికకాయాన్ని తరలించారు. మదనపల్లె, అంగళ్లు, కంటేవారిపల్లె మీదుగా రేగడవారిపల్లెకు మృతదేహాన్ని తీసుకువచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్గం వెంబడి సాయితేజకు ఘన నివాళి అర్పించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. సరిహద్దున గల చీకలబైలు నుంచి అభిమానులు, ప్రజలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు.

కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం
సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.50 లక్షల పరిహారాన్ని చెక్కు రూపంలో అందించారు. తన అన్న సాయితేజ దేశ సేవలో తుది శ్వాస విడిచినా.. తాను దేశ సేవ నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని సాయితేజ సోదరుడు బి.మహేష్బాబు చెప్పారు. సిక్కింలో జవానుగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్బాబు ప్రమాదంలో మరణించిన సాయితేజ తన సోదరుడేనని కొంత ఆలస్యంగా తెలిసిందన్నారు. తన అన్న దేశ సేవలోనే ప్రాణాలర్పించారని... అన్న మరణం తీరని లోటే అయినా, తాను జవానుగానే కొనసాగుతానన్నారు.

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
తల్లిదండ్రుల బాధ్యతను కూడా నెరవేరుస్తానని చెప్పారు. ఈ నెల 8వ తేదీన ప్రమాదం జరిగినా...భౌతికకాయం గుర్తించటంలో సమస్యలు ఎదురుకావటంతో సమయం తీసుకున్నారు. సాయితేజకు ఇద్దరు భార్య...ఇద్దరు పిల్లలు. తొమ్మిదేళ్ల క్రితం ఆర్మీలో చేరిన సాయితేజ..లాన్స్ నాయక్ హోదాలో ఉన్నారు. సీఎస్ఢీ బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ అధికారిగా పని చేస్తున్నారు.
తన కుమారుడు మరణం తమకు బాధ కలిగిస్తున్నా... బిపిన్ రావత్ సెక్యూరిటీ అధికారి స్థాయికి చేరి దేశ సేవలో మరణించినందుకు తన కుమారుడిని చూసి గర్విస్తున్నానని సాయితేజ తండ్రి చెప్పుకొచ్చారు. పూర్తి అధికారిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు జరగనున్నాయి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications