గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరులో భగ్గుమన్న పాత కక్షలు: వేట‌కొడ‌వ‌ళ్ల‌తో దాడి, ఒకరు మృతి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: గుంటూరు జిల్లాలో పాత కక్షలు భగ్గమన్నాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో తెనాలి మండలంలోని నేలపాడు-సిరిపురం రహదారి మధ్యలో నలుగురు వ్యక్తులపై ప్రత్యర్థులు వేట‌కొడ‌వ‌ళ్ల‌తో దాడి చేశారు. ఈ దాడి ఘటనలో బాలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడి వారిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురు ఓ కేసు విషయమై కోర్టుకు వెళ్తుండగా వేట కొడవళ్లతో దాడి చేశారు. వీరంతా కొల్లిపార మండలం తుములూరుకు చెందిన వారిగా గుర్తించారు.

Man Killed, 3 Injured In attack In Guntur

ఎకరం పోలం విషయంలో వీరి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీంతో ఈ దాడికి ఆస్తి త‌గాదాలే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. బాల‌య్య తన స‌న్నిహితుల‌తో కలిసి ప్రయాణిస్తున్న ఆటోను ప్రత్యర్థులు అంబాసిడర్ తో డీకొట్టి ఆ తర్వాత వేట కోడవళ్లతో దాడి చేశారు.

ఈ దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Man Killed, 3 Injured In attack In Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X