మహిళతో అక్రమ సంబంధం: ఆమె కూతురిపై ఏడాదిన్నర రేప్
ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఓ వ్యక్తి ఆమె కూతురిపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది.
కర్నూలు: ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఓ వ్యక్తి ఆమె కూతురిపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. నా అన్నవారు లేని మహిళను చేరదీసి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆగకుండా ఆమె కూతురినీ వాడుకున్నాడు.
కర్నూలు జిల్లా ప్యాపిలిలో ఈ దారుణం వెలుగుచూసింది. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. కర్నూలు జిల్లా హెచ్ఆర్ పల్లికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో 18ఏళ్ల క్రితం ప్యాపిలి చేరుకుంది. ఓ హోటల్లో పాచిపని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ప్యాపిలికి చెందిన ఎద్దుల వ్యాపారి వారం సుబ్రహ్మణ్యం(60)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలోనే అతడి కన్ను ఆమె కుమార్తె(22)పైనా పడింది. తల్లి ఇంట్లో లేని సమయంలో ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.
దాదాపు ఏడాదిన్నర పాటు అతను అఘాయిత్యం కొనసాగిస్తూ వచ్చాడు. దాంతో గర్భం దాల్చిన బాధితురాలు వారం రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇలాంటి అన్యాయం మరొకరికి జరగకూడదని భావించిన తల్లీకూతుళ్లు ప్యాపిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు నిందితుడు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.