ఉదయ్కిరణ్లా ఆత్మహత్య: జగన్పై మారెప్ప సంచలనం
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మారెప్ప మంగళవారం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. పార్టీలో టిక్కెట్లు ఆశించిన చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని, తాను పిరికివాడిని అయితే హీరో ఉదయ్ కిరణ్లా ఆత్మహత్య చేసుకునేవాడినన్నారు.
తాను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన ఉన్న అభిమానంతో జగన్ వెంట ఉన్నానని కానీ, పార్టీలో దళితులకు న్యాయం జరగడం లేదన్నారు. రెడ్లకే పార్టీలో ప్రాధాన్యత ఉందని ఆరోపించారు. తనను పార్టీ కరివేపాకులా వాడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.

ముందు నుండి పార్టీలో ఉండి పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అది సరికాదన్నారు. మొదటి నుండి ఉన్న వారిని గుర్తించాలన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల నుండి వచ్చిన వారిని అందలమెక్కించవద్దన్నారు.
తెలంగాణపై...
హైదరాబాదులోని కేవలం పన్నెండు కార్పోరేట్ కుటుంబాలే విభజనను వ్యతిరేకిస్తున్నాయని మారెప్ప విమర్శించారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేయాలన్నారు. చిన్నా రాష్ట్రాల ఏర్పాటులో ఎలాంటి తప్పు లేదన్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేమని చెప్పారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications