భర్త అక్రమ సంబంధం: పిల్లలతో కలిసి భార్య సంపులో దూకి ఆత్మహత్య

ఇతడు షనూర్బేగానికి వరసకు పిన్ని అయ్యే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. భార్యను తరచూ వేధిస్తున్నాడు. దీంతో షనూర్బేగం మనస్తాపం చెందింది. గురువారం ఉదయం భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత పిల్లల్ని సంప్లో పడేసి తానూ దూకింది. చుట్టుపక్కల వారు గమనించి కాపాడే ప్రయత్నం చేయగా ఫలితం లేకపోయింది.
సమాచారమందుకున్న ఆసిఫ్నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నవాజ్పాషా, షరూర్బేగం బంధువుల నుంచి సమాచారం సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఆసిఫ్నగర్ ఏసీపీ గౌస్ మొహియుద్దీన్, ఆసిఫ్నగర్ సీఐ శ్రీకాంత్ సందర్శించారు.
దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు షనూర్ బేగం సోదరి ఒమేరాబేగం తెలిపింది. నవాజ్పాషా వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను వేధించే వాడని ఒమెరాబేగం తెలిపింది. తరచూ వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆమె పోలీసులకు తెలిపింది.












Click it and Unblock the Notifications