Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం, భారీగా ఉద్యోగావకాశాలు

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ ప్లాంట్‌(బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్)ను ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, అశోక్ లేలాండ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

అమరావతిలో ప్రారంభమైన తొలి ఆటోమొబైల్ ప్లాంట్‌గా అశోక్ లేలాండ్ నిలిచింది. మల్లవల్లి పారిశ్రామికవాడలోని 75 ఎకరాల్లో ఈ ప్లాంట్ విస్తరించి ఉంది. ఈ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్, డీజిల్ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది హిందూజా గ్రూప్. ఈ ప్లాంట్ ఏడాదికి 2400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఈ యూనిట్ ద్వారా ఫేజ్-1లో 600 మందికి ఉపాధి లభిస్తోంది. ఇక, ఫేజ్-2లో 1200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Minister Lokesh inaugurates Ashok Leyland plant in Mallavalli

హిందూజా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన అశోక్ లేలాండ్ ప్రపంచంలో బస్సుల ఉత్పత్తిలో నాలుగో స్థానం ఉంది. కాగా, మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ప్రారంభించడానికి ముందు హనుమాన్ జంక్షన్ అభయాంజనేయస్వామి ఆలయంలో మంత్రి లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రి లోకేశ్‌కు ఆశీర్వచనాలు అంజేశారు.

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి సమీక్ష

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి సంబంధించి అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై ఉండవల్లి నివాసంలో సమీక్షించారు మంత్రి లోకేశ్. ప్రముఖ దేవాలయాల తరహాలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

రహదారుల నిర్మాణం, వసతి, ఇతర సదుపాయాలు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని, అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఇందుకు ఆలయ పండితులతో పాటు నిపుణుల సలహాలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

మంగళగిరిలో అభివృద్ధి పనులపై సమీక్ష

మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుల డీపీఆర్ లపై అధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్ సమీక్షించారు. పలు సూచనలు చేశారు. ఎంటీఎంసీ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రేనేజీ, డ్రింకింగ్ వాటర్, స్టార్మ్ వాటర్(వర్షపు నీటి నిర్వహణ) ప్రాజెక్టులకు సంబంధించి మే నెలలో పనులు ప్రారంభించి ఏడాదిన్నరలోగా పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆయా ప్రాజెక్టుల డీపీఆర్ లను పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చినకాకాని ఆస్పత్రి విస్తరణకు ఆదేశాలు

మంగళగిరి సమీపం చినకాకాని వద్ద వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై ఆసుపత్రి సాధన కమిటీ సభ్యులు, అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారు మంత్రి నారా లోకేశ్. వందపడకల ఆసుపత్రిని భవిష్యత్తులో జి ప్లస్3 కి విస్తరించేలా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. డాక్టర్లు, నర్సులు, పేషెంట్ల బంధువులు, రోగులకు వేర్వేరు నడకదారులు ఉండేవిధంగా డిజైన్‌లో మార్పులు చేయాలని సూచించారు. ఆసుపత్రిలో ప్రత్యేకంగా డి అడిక్షన్ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. సాధన కమిటీ సూచనల మేరకు డిజైన్‌లో పలు మార్పులు, చేర్పులు చేయడం జరిగిందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+