ఆ ఎమ్మెల్యేలపై లోకేష్ సీరియస్..! సీనియర్లకు కీలక బాధ్యత..!
ఏపీలో గతేడాది ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తోంది. ఈ కాలంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం విషయంలో దూసుకెళ్తున్నా.. దాన్ని క్షేత్రస్దాయికి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. దీనికి తోడు క్షేత్రస్ధాయిలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కొత్త కొత్త సమస్యలు తీసుకొస్తున్నారు. వీటిని పరిష్కరించడం ఒక్కోసారి సీఎం చంద్రబాబుకే తలకు మించిన భారమవుతోంది. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై మంత్రి నారా లోకేష్ ఇవాళ ఫైర్ అయ్యారు.
ఇవాళ ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులను పిలిపించుకుని మాట్లాడిన నారా లోకేష్.. తొలిసారి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వారికి అవగాహన ఉండటం లేదని, అనుభవ లేమితో ఉన్నారని, దీంతో ఇతరులతో సమన్వయం ఉండటం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. తాజాగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తో పాటు మరికొందరు తొలిసారి గెలిచిన వారితో తలెత్తిన వివాదాల నేపథ్యంలో లోకేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇవాళ మంత్రులతో భేటీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, వివాదాల్లో చిక్కుకుంటున్న వారిపై లోకేష్ చర్చించారు. వారిని గాడిన పెట్టే బాధ్యతను సీనియర్ మంత్రులకు లోకేష్ అప్పగించారు. ఆయా ఎమ్మెల్యేలకు తమ అనుభవాలు చెప్పాలని మంత్రులకు లోకేష్ సూచించారు. ముఖ్యంగా తాము తొలిసారి ఎమ్మెల్యేలు అయినప్పుడు ఎదురైన పరిస్ధితులు, అనుభవాలను వారికి వివరించాలని సూచించారు. లోపాల్ని సరిదిద్దుకోకపోతే మళ్లీ మళ్లీ గెలవడం సాధ్యం కాదని వారికి చెప్పాలని సూచించారు.

ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో పెట్టుబడుల ఆకర్షణకు భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో వివాదాలకు దూరంగా ఉంటూ దీన్ని విజయవంతం చేసేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని లోకేష్ సూచించారు. ఈ సదస్సు విజయవంతమైతే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడుల, భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి ప్రతీ మంత్రీ తమ శాఖల పరిధిలో ఒప్పందాల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని లోకేష్ వారికి సూచించారు. అలాగే తమ జిల్లాల పరిధిలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు స్థాపించేలా మంత్రులు, ఇన్ ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications