అమరావతితో రైతులకు ఇచ్చిన ప్లాట్ల పై కీలక నిర్ణయం..!!
అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. తాజాగా రైతులకు ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండో విడత లాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగు తోంది. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల కల్పన పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. మంత్రి నారాయణ వీటిని పరిశీలన చేసారు. ఇదే సమయంలో లాండ్ పూలింగ్ తో పాటు గా రైతుల ప్లాట్ల పైన నారాయణ కీలక అంశాలను వెల్లడించారు.
అమరావతిలో లే అవుట్ రోడ్లు అన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయని... అనుకున్న సమయాని కే పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. రెండేళ్లలో డ్రైనేజ్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి అవుతాయని చెప్పారు. సీడ్ యాక్సిస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. అవసరమైన ప్రాజెక్టుల కు అనుగుణంగా తదుపరి భూసమీకరణ చేపడతామన్నారు. లంక భూములు, అసైన్డ్ భూముల్ని సమీకరణకు తీసుకున్న వారి సమస్యను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామని తెలిపారు. రైతులకు ఇచ్చిన ప్లాట్ లు ఉన్న 11, 8 జోన్ల లో మినహా అమరావతి పరిధిలోని 29 గ్రామాల పరిధిలో పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. 66వేల ఫ్లాట్స్లో 7వేల ఫ్లాట్స్ మాత్రమే ఇంకా రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందని తెలిపారు.

కాగా, రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ను రోజుకు 30 నుంచి 60 మంది చేసుకుంటు న్నారని చెప్పారు. 450 మంది రైతులకు ఇవ్వాల్సిన 1891 ఫ్లాట్స్లో కుటుంబ సభ్యుల సమస్యలు ఉన్నవి ఉన్నాయన్నారు. విదేశాల్లో ఉన్న వాటితో పాటు ఇతరత్రా రిజిస్ట్రేషన్లు రోజుకు వెయ్యి చేసేలా అధికారులను అందుబాటులో పెట్టామన్నారు. రైతులు ముందుకొచ్చి ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి కోరారు. 11, 8 జోన్లలో పనులు తొందరలోనే ప్రారంభించినున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగ్ అనుకున్నామని....ఫేజ్ వైజ్ కాదని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications