పీవీ సునీల్ సస్పెన్షన్-ఆర్ఎస్ ప్రవీణ్, పీవీ రమేశ్ కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ ఛీఫ్ గా పనిచేసిన పీవీ సునీల్ కుమార్ ను కూటమి ప్రభుత్వం తాజాగా సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనలు చేసారన్న ఆరోపణలపై క్రమశిక్షణా ఉల్లంఘన కింద ఆయన్ను సస్పెండ్ చేశారు. దీంతో డీఐజీ స్దాయి అధికారిని ఇలా సస్పెండ్ చేయడంపై మాజీ అఖిల భారత సర్వీసు అధికారుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ తో పాటు పలువురు దీనిపై స్పందించారు.
ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఎక్కడ AP రాష్ట్రానికి డీజీపీ ఐతడేమో అన్న అక్కసుతోనే IPS ఆఫీసర్ PV సునీల్ కుమార్ను @ncbn @PawanKalyan ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నా.
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 2, 2025
సునీల్ కుమార్ పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లారని చెప్పడం కోడి గుడ్డు మీద ఈకలు పీకడమే? This is… pic.twitter.com/Nh8cwMAxvt
డీఐజీ కాకుండా అడ్డుకునేందుకే పీవీ సునీల్ కుమార్ ను ఇలా కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆయన సెలవు తీసుకున్నప్పుడు ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఆయనేమీ మీలా డిప్లమోటిక్ పాస్ పోర్టుతో ప్రజల డబ్బుతో విదేశాలకు వెళ్లలేదు కదా అని విమర్శలు గుప్పించారు. ఈ రూల్ మిగతా వారికి కూడా అమలు చేస్తే సగం మంది సస్పెండ్ అవుతారన్నారు. అక్కడితే ఆగకుండా చంద్రబాబు, లోకేష్ దావోస్ టూర్ పైనా ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు గుప్పించారు.

నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడే అధికారులను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. అటువంటి నేరాలకు పాల్పడే #IPS #IAS అధికారులను తగిన ప్రక్రియ తర్వాత సర్వీసు నుండి తొలగించాలి. తన సొంత భార్యపై తీవ్రమైన నేరాలు చేసిన IPS అధికారిపై సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది. రాజకీయ ప్రోత్సాహం కారణంగా…
— Dr PV Ramesh (@RameshPV2010) March 2, 2025
మరోవైపు ఏపీలో మాజీ సీనియర్ ఐఏఎస్ పీవీ రమేశ్ మాత్రం పీవీ సునీల్ అరెస్టుపై భిన్నంగా స్పందించారు. నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడే అధికారులను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు. అటువంటి నేరాలకు పాల్పడే #IPS #IAS అధికారులను తగిన ప్రక్రియ తర్వాత సర్వీసు నుండి తొలగించాలన్నారు. తన సొంత భార్యపై తీవ్రమైన నేరాలు చేసిన ఐపీఎస్ అధికారిపై సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోందని, రాజకీయ ప్రోత్సాహం కారణంగా ఆయన పదవిలో కొనసాగారని గుర్తుచేశారు. కులం పేరుతో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించే అటువంటి వ్యక్తులను అందరూ ఖండించాలన్నారు. మతం, కులం, ప్రాంతం ఏదైనా నేరస్థుడు నేరస్థుడే అన్నారు.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications