"నల్లకుబేరులకు ముందే సమాచారం.. సామాన్యులకే కష్టాలు"
పుత్తూరు : సగటు సామాన్యురాలిగా కొత్త నోట్ల కోసం బ్యాంకు వద్ద క్యూ లో నిలుచున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. నగదు మార్పిడి కోసం చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లిన ఆమె.. క్యూ లో చాలాసేపు వేచి చూసిన లాభం లేకపోయింది. బ్యాంకు తెరిచిన కొద్దిసేపటికే బ్యాంకులో డబ్బు అయిపోయినట్టు ప్రకటించడంతో.. బ్యాంకు అధికారులను నిలదీశారు రోజా.
డబ్బు కొరతపై ఎమ్మెల్యే రోజా బ్యాంకు మేనేజర్ ను నిలదీయగా.. ఏం సమాధానాలో చెప్పాలో తెలియని మేనేజర్ మౌనంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది. పాతనోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చని ప్రభుత్వం చెప్పినట్టు.. అందుకు తగ్గట్టుగా చర్యలు ఎందుకు తీసుకోలేదని మేనేజర్ ను ప్రశ్నించారు రోజా.

అనంతరం బ్యాంకు నుంచి బయటకొచ్చిన రోజా మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే అయిన తానే నగదు కోసం ఇబ్బంది పడుతుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాలిక లేకుండా.. పెద్ద నోట్లను రద్దు చేయడం సామాన్యులకు లేని కష్టాలను తీసుకొచ్చిందన్నారు.
నల్లకుబేరులకు ముందే సమాచారం ఇవ్వడంతో వారంతా సంతోషపడుతున్నారని, కేవలం సామాన్యులే ఇబ్బందులే ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. పనులన్ని మానుకుని జనమంతా బ్యాంకుల ఎదుట గంటల తరబడి వేచియున్నా.. డబ్బులు అందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications