రుతువపనాల రాక, తొలకరి మొదలు - తీవ్ర తుఫానుగా బిపర్జాయ్..!!
ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించాయి. కేరళ, దక్షిణ తమిళనాడుల్లో అనేక ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలో మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి. ఈ నెల 14వ తేదీ తరువాత తొలుత రాయలసీమలో, ఆ తరువాత దక్షిణ కోస్తాలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు వచ్చేంత వరకు ఎండలు కొనసాగనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన 'బిపర్జాయ్' గురువారం అతి తీవ్ర తుఫానుగా మారింది. రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడనుంది.
విస్తరిస్తున్న రుతుపవనాలు:రుతుపవనాల ప్రవేశంతో తొలకరి మొదలైంది. పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు గురువారం విస్తరించాయి. గడచిన 24 గంటల్లో కేరళలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ రాష్ట్రంలో ఎంపిక చేసిన 14 కేంద్రాల్లో రోజుకు 2.5 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రానున్న రెండు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, కేరళలో మిగిలిన ప్రాంతాలు, తమిళనాడులో మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో పలు ప్రాంతాలు, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు, ఈశాన్య భారతంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని పేర్కొంది. అతి తీవ్ర తుఫాన్ 'బిపర్జాయ్' ప్రభావంతో వారం రోజుల వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

14వ తేదీ తరువాతనే:తెలుగు రాష్ట్రాలో ఈ నెల 14వ తేదీ తరువాత రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నెల 14వ తేదీ తరువాత తొలుత రాయలసీమలో, ఆ తరువాత దక్షిణ కోస్తాలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనెల 17వ తేదీ తరువాత ఉత్తర కోస్తా వరకు రుతుపవనాలు విస్తరించనున్నాయని చెబుతున్నారు.
సాధారణంగా జూన్ 5న రాయలసీమ, 10న ఉత్తర కోస్తాకు రుతుపవనాలు రావల్సి ఉంది. కేరళకు ఆలస్యంగా ప్రవేశించటంతో..తెలుగు రాష్ట్రాల్లో మరో అయిదు రోజులు ఎండలు కొనసాగనున్నాయి. ఇదే సమయంలో రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం సమయంతో వడగాల్పులు..సాయంత్రం తరువాత పలు ప్రదేశాల్లో వర్షాలు కురిసాయి.
తీవ్ర తుఫానుగా బిపర్జాయ్:అరేబియా సముద్రంలో ఏర్పడిన 'బిపర్జాయ్' గురువారం అతి తీవ్ర తుఫానుగా మారింది. రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడుతుందని భావిస్తున్నారు. 'బిపర్జాయ్' చాలా వేగవంతంగా బలోపేతమవుతోందని గుర్తించారు. తుఫాను గాలుల తీవ్రత ప్రస్తుతం గంటకు 135 నుంచి 145 కిలోమీటర్లు ఉంది.
కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తీరప్రాంతాలపై దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. దీనివల్ల వచ్చే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సిద్ధమయ్యామని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. తుఫాన్ పూర్తిగా బలహీనం కావడానికి మరో వారం పడుతుందని, ఆ తరువాతే రుతుపవనాల పురోగతి వేగంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 14వ తేదీ తరువాత తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల విస్తరణతో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications