వేడి సెగల వేళ చల్లని కబురు - రాష్ట్రంలోకి రుతుపవనాలు..!!
ఏపీలో రెండు రోజులుగా వేడి సెగలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు అదే రకంగా వడ గాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు అందించింది. తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఆగమనం మొదలైంది. మరి కొద్ది గంటల్లోనే రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. దీంతో, రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు మొదలవుతాయని అంచనా వేస్తుననారు.
రుతుపవనాల ప్రవేశం
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్2న ఏపీలో.. జూన్ 10నుంచి తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రెండు, మూడు రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయంటూ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. జూన్ 2 నుంచి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీలో రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని.. దక్షిణ కోస్తాలో వడగాలులు వీస్తాయని.. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

రికార్డు ఉష్ణోగ్రతలు
ఇప్పటికే కేరళ తీరాన్ని తాకిన నైరుతీ రుతుపవనాలు చాలా చురుగ్గా ముందుకు విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో భారీ మేఘాలు కమ్ముకుని భారత భూభాగంలో అక్కడక్కడ భారీ వర్షాలు అందుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాల కదలికతో ఏపీలో తొలకరి జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనాలు వెల్లడించారు. మరో రెండు రోజుల్లో ఏపీలో ఋతుపవనాలు విస్తరించే ఛాన్స్ బలంగా ఉందని చెప్పారు వాతావరణశాఖ అధికారులు. అన్ని అనుకూలిస్తే .. జూన్ ఫస్ట్ వీక్లోనే రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.
కోస్తాలో వర్షాలు
మరోవైపు తెలంగాణ రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.జూన్ 10లోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు, జూన్ 10 లోగా తెలంగాణకు రుతుపవనాలు చేరుకుంటాయని వాతావరణశాఖ అధికారి తెలిపారు. జూన్ 11 వరకు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వెల్లడించారు. జూన్ 1 నుంచి మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేరొన్నారు. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్ల నమోదవుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలగనుంది.
-
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..!












Click it and Unblock the Notifications