జగన్పై 75శాతంమంది డైలమా: సబ్బం, పండుగ: టిడిపి
హైదరాబాద్/విశాఖ: మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన శుక్రవారం మరోసారి నిప్పులు చెరిగారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 75 శాతం మంది డైలమాలో ఉన్నారని చెప్పారు. రాజకీయ అనిశ్చితి సమయంలో వారు జగన్ పార్టీ నుండి గెలిచారు తప్ప నాయకుడిగా జగన్ పైన పూర్తిస్థాయి నమ్మకం వారికి లేదన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డిని తమ నాయకుడిగా ప్రేమతో వారు అంగీకరించే పరిస్థితి లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటమికి కారణం జగనే అన్నారు. నాయకులు, కార్యకర్తలతో జగన్ వైఖరి ఓటమికి కారణమన్నారు.

పండుగ చేసుకుందాం: మోత్కుపల్లి
జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రజలమంతా పండుగ చేసుకుందామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల కృషి ఫలితంగానే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తమ పార్టీ సహకరిస్తుందని చెప్పారు. తెలంగాణలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు చేస్తామని రావుల చంద్రశేఖర రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరుగుతున్న జూన్ 2న పవిత్ర దినమని, అలాంటి రోజున కొత్త ప్రభుత్వం హామీల అమలు పైన ప్రకటన చేయాలని రావుల చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications