గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు: దిక్కులు పిక్కటిల్లేలా రోదన..

కుక్కల దాడిలో గాయపడిన కొడుకును చూసి విలవిల్లాడింది.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: కూలీకి వెళ్లిన తల్లికి.. ఇంటికొచ్చేసరికి పిడుగు లాంటి వార్త చెవిన పడింది. కుక్కల దాడిలో గాయపడిన కొడుకును చూసి విలవిల్లాడింది. కొడుకు మృతదేహం రక్తమోడుతున్న దృశ్యం చూసి గుండెలవిసేలా ఏడ్చింది. ఈ హృదయ విదారక సంఘటన గుంటూరు జిల్లా అడవి తక్కెళ్ళపాడులో చోటు చేసుకుంది.

గుంటూరులో విషాదం: విరుచుకుపడ్డ వీధికుక్కలు.. బాలుడు మృతిగుంటూరులో విషాదం: విరుచుకుపడ్డ వీధికుక్కలు.. బాలుడు మృతి

పని నుంచి రాగానే.. మీ అబ్బాయిని కుక్కలు కరిచాయన్న విషయం తెలిసి.. ఆ తల్లి ఉరుకులు పరుగులతో ఆసుపత్రికి చేరింది. కళ్లెదుట కన్న కొడుకు రక్తపు ముద్దలా పడి ఉండటం చూసి తట్టుకోలేకపోయింది. దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న బిడ్డంగా.. అపురూపంగా పెంచుకున్న బిడ్డ.. ఇలా అర్థాంతరంగా దుర్మరణం చెందడం ఆమెను తీవ్రంగా కలచివేసింది.

mother cries after seeing son's dead body in guntur hospital

ఆ తల్లి గుండెలవిసేలా ఏడుస్తుంటే చుట్టున్నవారంతా నిశ్చేష్టుల్లా నిలబడిపోయారు. ఆసుపత్రిలో ఇలాంటి దృశ్యాలు సాధారణమే అయినప్పటికీ.. ఆ తల్లి రోదన మాత్రం ప్రతీ ఒక్కరిని కలచివేసింది.

English summary
A four-year-old boy was mauled to death by a pack of stray dogs near Rajiv Gruha Kalpa apartments at Adavitakkellapadu in Guntur district on Thursday .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X