ట్వీట్లు, సభలతో హోదా రాదు: పవన్, జగన్లను ఉద్దేశించి ముద్రగడ
ప్రత్యేక హోదా సాధనపై కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పరోక్షంగా పవన్ కల్యాణ్, జగన్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కలిసి రావాలని పిలుపునిచ్చారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్లను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
ట్వీట్లు చేయడం, సభలు పెట్టడంతో ప్రత్యేక హోదా వస్తుందనుకోవడం భ్రమ మాత్రమేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముందుకొచ్చే పార్టీలు, వ్యక్తులతో కలిసి పోరాటం చేస్తానని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడతామంటున్న వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఒకే గొడుగు కిందకి రావాలని అన్నారు. ప్రత్యేక హోదా రాకపోతే యువతకి తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అన్ని రాజకీయ పార్టీలకు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులకు లేఖలు రాశానని చెప్పారు.
సెలబ్రిటీలకు కూడా తాను లేఖలు రాసినట్లు తెలిపారు. తలుచుకుంటే సాధ్యం కానిది వుండదని, ప్రత్యేక హోదా కూడా అంతేనని, ప్రత్యేక తెలంగాణ, తమిళనాడులో జల్లికట్టు వంటివి ఉద్యమాల ద్వారానే సాధ్యమయ్యాయనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించాలని ముద్రగడ అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications