ప్రజల సొమ్ము మాకొద్దు - భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు..!!
చంద్రబాబు అరెస్ట్..తదనంతర పరిణామాలపై నారా భువనేశ్వరి(Bhuvaneswari) కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు అరెస్ట్ సమయం నుంచి భువనేశ్వరి, బ్రాహ్మణి(Brahmani) రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు రెండు సార్లు చంద్రబాబు(Chandra Babu)ను కలిసిన ఈ ఇద్దరు ఈ రోజు మరోసారి కలవనున్నారు. జగ్గంపేట దీక్షా శిబిరంలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన భువనేశ్వరి.. చంద్రబాబు(Chandra Babu) ప్రజల కోసమే ఎప్పుడూ ఆలోచన చేస్తారని చెప్పుకొచ్చారు. ఏం తప్పు చేసారో చెప్పాలని డిమాండ్ చేసారు.
చంద్రబాబు (Chandrababu) ప్రజల మనిషి అని నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పేర్కొన్నారు. జగ్గంపేట దీక్షా శిబిరంలో చంద్రబాబు ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారో చెప్పాలని డిమాండ్ చేసారు. తమ కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదన్నారు. హెరిటేజ్లో 2 శాతం అమ్మినా రూ.400 కోట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. ప్రజల సొమ్ము మాకొద్దంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. మానవుడే దేవుడు నాన్న ఎన్టీఆర్ నమ్మారని వివరించారు. ఆ నీడలో తాము పెరిగామని..ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నామని చెప్పుకొచ్చారు.

ప్రజల కోసమే తమ పోరాటమని స్పష్టం చేసారు. తమ కుటుంబం ట్రస్ట్(NTR Trust) ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వేలాది మందిని చదివిస్తున్నామని వివరించారు. చంద్రబాబు(Chandra Babu)ను ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచన చేస్తారని చెప్పుకొచ్చారు. ఏపీ ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారని చెప్పారు. అటువంటి ప్రజల మనిషిని జైల్లో పెట్టారని..ప్రజల కోసం చంద్రబాబు జైలుకు వెళ్లారని పేర్కొన్నారు. చంద్రబాబు(ChandraBabu) చేసిన తప్పు ఏంటని భువనేశ్వరి ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ది చెంది అనేక మంది సీఈవో స్థాయికి వెళ్ళారని చెప్పారు. చంద్రబాబు(ChandraBabu) చేసింది తప్పా అనేది ఆలోచించాలని సూచించారు. ఐటీ, ఇతర రంగాలు హైదారాబాద్ నుంచి రాజమండ్రి(Rjahmundry)కి వచ్చారన్నారు. కానీ పోలీసులు అడ్డుకుని, వారిని ఆపేశారన్నారు. హైదరాబాద్ నుంచి రావడానికి పాస్ పోర్ట్లు కావాలా అని ప్రశ్నించారు.

ఎందుకు భయపడుతున్నారని నిలదీసారు. ఎప్పుడూ రాని మహిళలు కూడా బయటకు వచ్చారని చెప్పారు. తాను బీఏ చదువుకున్నానని.. చంద్రబాబు మంత్రి అయ్యాక తనను హెరిటేజ్(Heritage)లో వదిలేశారని... మూడు నెలలు కష్టపడి నేర్చుకుని హెరిటేజ్ చూసుకుంటున్నాని భువనేశ్వరి వివరించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications