ఫోన్ ట్యాపింగ్ బట్టబయలైంది, ఇప్పుడేమంటారు? కెసిఆర్కు లోకేష్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజం బట్టబయలైందని.. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇప్పుడేం సమాధానం చెబుతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతనయుడు, టిడిపి యువ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. దీనిపై శనివారం ఆయన ట్విట్టర్లో స్పందించారు.
Now cat is out of the bag! Truth we have been saying is stated again by telecom operators. What is ur answer KCR? http://t.co/6n25giwWH1 1/3
— Lokesh Nara (@naralokesh) July 25, 2015 ‘అసలు గుట్టు రట్టయింది. మేం ఇంతకాలం చెబుతున్నదే నిజమని టెలికం కంపెనీలూ తెలిపాయి. కెసిఆర్.. ఇప్పుడు మీ సమాధానం ఏమిటి? ' అని లోకేష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
KCR & Co says one thing but does another. A "no" means yes. Yes to phone tap! http://t.co/UQbISGJ2U4 (2/3)
— Lokesh Nara (@naralokesh) July 25, 2015 కెసిఆర్ అండ్ కో కంపెనీ చెప్పేదొకటి చేసేదొకటని విమర్శించారు. వాళ్ళు ఔనంటే కాదని, ఫోన్ ట్యాపింగ్ చేయలేదంటే చేశారని అర్థమని అన్నారు. ‘తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను బలి చేసే కెసిఆర్ స్వార్థ వైఖరి ఇంకా కొనసాగుతోంది' అని లోకేష్ దుయ్యబట్టారు.
KCR's habit of sacrificing people for his selfish motives continue. Students in the past and officers now!! (3/3)
— Lokesh Nara (@naralokesh) July 25, 2015 కేసీఆర్ అండ్ కో చెప్పేదొకటి... చేసేదొకటి! వాళ్లు లేదు అంటే ఉందని అర్థం. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అర్థం. తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజలను బలి చేయడం కెసిఆర్కు అలవాటు. గతంలో విద్యార్థులు... ఇప్పుడు అధికారులు' అని లోకేశ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications