Nara Lokesh : మైనార్టీలకు నారా లోకేష్ కీలక హామీ-ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు
2024లో టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని శ్రీకాళహస్తిలో పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ హామీ ఇచ్చారు.
ఏపీలో యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ శ్రీకాళహస్తికి చేరుకున్నారు. నగరంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఆయన స్ధానికంగా ముస్లింలతో భేటీ అయ్యారు. వారు ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. వారికి ఓ కీలక హామీ కూడా ఇచ్చారు.

ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని టీడీపీ యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ముస్లింలతో భేటీ అయిన నారా లోకేష్.. వైసీపీ ప్రభుత్వంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించారు. ముఖ్యంగా మైనార్టీ కార్పోరేషన్ నిర్వీర్యం అయిందని, దీంతో ముస్లింలకు రుణాలు అందడం లేదని లోకేష్ తెలిపారు. ముస్లింలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు.

2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి ముస్లింలను ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తగిన పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు కల్పిస్తామని లోకేష్ వెల్లడించారు. అలాగే ఇండస్ట్రీ క్లస్టర్లలోనూ ముస్లింలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తామన్నారు. టీడీపీ హాయాంలో శ్రీకాళహస్తి పరిసరాల్లో పరిశ్రమలు తీసుకొచ్చామని, ఇప్పుడు ఆ పరిశ్రమల్లో పది వేల మంది వరకు పని చేస్తున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రస్తుతానికి లక్ష మంది పని చేస్తూ ఉండేవాళ్ళని అన్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications